ETV Bharat / state

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 3:11 PM IST

Updated : Feb 2, 2024, 6:48 PM IST

CM Revanth Reddy visits Keslapur and Indravelly Today : ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ అమరులను స్మరిస్తూ ఓ వైపు అతివలతో మాటాముచ్చట, మరోవైపు అభివృద్ధికి శ్రీకారం చుడుతూ అడవుల ఖిల్లా ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం, కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి నివాళులర్పించిన తొలి ముఖమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచారు.

CM Revanth Reddy visits  Indravelly Today
CM Revanth Reddy visits Keslapur

CM Revanth Reddy visits Keslapur and Indravelly Today : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరిన సీఎం, కేస్లాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేంసాగర్‌, సీఎస్‌ శాంతికుమారి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

CM Revanth Reddy Adilabad Tour : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి నాగోబా ఆలయానికి వెళ్లారు. నాగోబా దర్శనానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి మోస్త్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, 6 కోట్లతో చేపట్టనున్న నాగోబా(Nagoba Temple) ఆలయ అభివృద్ది పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఆలయ గోపురం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా సీఎం ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత, నాగోబా ఆలయం పక్కన ఉన్న దర్బార్‌ హాల్లో కేస్లాపూర్‌ స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వీక్షించారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన పురోగతిని సీఎంకు వారు వివరించారు. అనంతరం, కేస్లాపూర్‌లో మహిళా సంఘాల సభ్యులతో జరిగిన ముఖాముఖిలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

Congress Indravelli Meeting Today :ప్రభుత్వ పథకాలు, మహిళలు సాధించిన విజయాల గురించి తెలుసుకున్న సీఎం, ఆడబిడ్డల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. కేస్లాపూర్‌ నుంచి రోడ్డుమార్గాన ఇంద్రవెల్లి చేరుకున్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఇంద్రవెల్లి రణస్థలిలో అమరులైన వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు, అనంతరం, అమరవీరుల స్మృతివనం పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.

పర్యటనలో భాగంగా తాగునీటి సౌకర్యం, గిరిజన సంక్షేమ రోడ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మూడు గంటలకు పైగా సాగిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన విజయవంతం కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహా అన్ని శాఖల అధికారులు సభ నిర్వహణను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

"మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం. కుటుంబ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతలకు కడుపునొప్పి ఎందుకు?. ఇలాంటి మహిళలు తగిన బుద్ధి చెప్పాలి". - రేవంత్‌రెడ్డి, సీఎం

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

Last Updated :Feb 2, 2024, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.