ETV Bharat / state

గడువు తీరాక చీటి డబ్బులు ఇవ్వకుండా వేధింపులు - నలుగురు నిర్వాహకులు అరెస్టు - Chit fund fraud four arrest

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 4:49 PM IST

Fraud in Chit funds in kamareddy
Chit fund fraud four arrested in Kamareddy

Chit fund fraud four arrested in Kamareddy : చిట్​ ఫండ్స్​ పేరుతో సభ్యులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురి నిర్వాహకులను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వీరు వివిధ చోట్ల బ్రాంచులు ఏర్పాటు చేసి రూ.2 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

Chit fund fraud four arrested in Kamareddy : చిట్ ​ఫండ్స్​ పేరిట సభ్యులను మోసం చేయడానికి యత్నించిన నలుగురి నిర్వాహకులను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్​ఎల్​వీఎస్​ చిట్స్​ ​ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో ఏర్పాటైన చిట్​ఫండ్స్​ కంపెనీ యజమానులు బిల్ల దశరథెడ్డి(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), ఆయన భార్య పద్మావతి, కుమారుడు నితీశ్​ రెడ్డిలతో పాటు బిల్ల అచ్యుత్​ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

కామారెడ్డి సీఐ చంద్రశేఖర్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అహ్మద్ మొహియుద్దీన్ వీరి చిట్​ఫండ్స్​ కంపెనీలో రెండు చీటీలు వేశారు. చీటీల గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో అహ్మద్ కంపెనీ యజమానులను సంప్రదించాడు. వారిని సంప్రదిస్తే అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపుతామని బెదిరింపులకు దిగారు. వారిపై రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్(Registrar of Chits) దగ్గర కూడా అనేకమంది ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన కనిపించలేదు.

రూ.2 కోట్ల మేర మోసం : ఇలా సుమారు 25 నుంచి 30 మంది వరకు చీటీ సభ్యులకు సంబంధించిన సుమారు రూ.2 కోట్ల మేర మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు అహ్మద్ మొహియుద్దీన్ తెలసుకున్నారు. దీంతో ఈ నెల 14న సదరు చిట్​ ఫండ్స్​ కంపెనీ యజమానులపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Fraud in Chit funds in kamareddy : చిట్​ఫండ్స్​ కంపెనీని కామారెడ్డితో పాటు సికింద్రాబాద్ శివారులోని కొంపల్లి, నిజామాబాద్, ఆర్మూర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, షాద్​నగర్, మెట్​పల్లి, వనపర్తి ప్రాంతాల్లో ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కంపెనీ నిర్వాహకుల నుంచి కారుతో పాటు ఐదు చరవాణులు, చీటీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్​ ఫండ్స్​ కంపెనీ బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సీఐ చంద్రశేఖర్​ రెడ్డి సూచించారు.

'జిల్లా కేంద్రంలోని ఎస్​ఎల్​వీఎస్​ చిట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలో రెండు చీటీలు బాధితుడు వేశారు. చీటీల గడువు అయిపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో దానికి గురించి అడిగారు. అడిగితే దుర్భాషలాడుతూ బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. విచారణ చేపట్టగా కుటుంబ సభ్యులే యజమానులుగా ఉండి చీటీలు నడిపించారని తెలిసింది. రూ.2 కోట్ల మేర మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నారు.'-చంద్రశేఖర్​ రెడ్డి, సీఐ

చిట్ ​ఫండ్స్​ సభ్యలను బురిడీ కొట్టే ప్రయత్నం - నలుగురు నిర్వాహకులు అరెస్టు

ఖాకీ ఉద్యోగాల పేరుతో రూ.11 లక్షలు కుచ్చుటోపీ - నకిలీ పోలీస్ అరెస్టు - fake cop arrested

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాల పేరిట ఎర - రూ.10లక్షలకు పైగా కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు - Cyber Crime in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.