ETV Bharat / state

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌' : చంద్రబాబు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:02 PM IST

BC Declaration in Jayaho BC Sabha : బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ-జనసేన ప్రకటించాయి. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ’ సభలో ఈమేరకు చంద్రబాబు, పవన్‌ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు చంద్రబాబు తెలిపారు.

BC Declaration in Jayaho BC Sabha
BC Declaration in Jayaho BC Sabha

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌': చంద్రబాబు

BC Declaration in Jayaho BC Sabha : బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పేర్కొన్నారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలిపారు. బీసీలకు టీడీపీ 40 ఏళ్లుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.

నాపై ఉన్న కేసుల వివరాలివ్వండి - ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు : జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని చంద్రబాబు ఆరోపించారు. రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త. పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తాం. బీసీలకు షరతులు లేకుండా విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తాం. లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తాం - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

157 కులాలకు న్యాయం : బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్‌ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదని, నాగరికతకు వారే మూలమని చంద్రబాబు పేర్కొన్నారు. చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలు పెట్టేలా కురబ, యాదవలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యాదవుల జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇస్తున్నామన్నారు. బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాకే బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిందని, అచ్చెన్నాయుడు, కొల్లు, యనమల, కళా వెంకట్రావుపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఎంపీ ఇస్తామన్నా వదులుకుని గుమ్మనూరు టీడీపీలోకి వచ్చారని, వెనుకబడిన వర్గాలను వేధించే పెద్దిరెడ్డిని మార్చగలరా? అంటూ సీఎం జగన్​కు చంద్రబాబు సవాల్ విసిరారు. బీసీలను ఊచకోత కోసే పల్నాడు వైఎస్సార్సీపీ నేతలను మార్చగలరా? అంటూ ప్రశ్నించారు. నలుగురు రెడ్లతో పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నారని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని విమర్శించారు. బీసీలంటే పల్లకీలు మోసే బోయీలు కాదని నిరూపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రత్తిపాటి శరత్​ అరెస్ట్ అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.