ETV Bharat / state

షైనింగ్ స్టార్ త్రిష పూజిత - మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తెలుగుమ్మాయి హవా

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 2:45 PM IST

Bhadradri Cricketer Trisha Poojitha WPL 2024 : ఎంతో మంది ఆదరభిమానాలు కురిపించే క్రికెట్‌ రంగంలో అమ్మాయిలు రాణించడమంటే సవాల్‌తో కూడుకున్న పనే. అలాంటి క్రీడలో జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించింది ఆ యువతి. చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తి పెంచుకున్న ఆ యువతి తన లక్ష్య సాధన కోసం 8 ఏళ్ల వయస్సులోనే శిక్షణ ప్రారంభించింది. నిరంతర సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి ఎంపికయ్యి ఔరా అనిపించింది. ఓ వైపు చదువులో రాణిస్తూనే మరోవైపు క్రికెట్‌ రంగంలో దూసుకుపోతుంది. భారత మహిళా క్రికెట్‌ టీమ్‌లో చోటు సంపాదించడమే ద్యేయంగా ముందుకు సాగుతున్న ఆ యువ క్రీడాకారిణి ఎవరో తెలుసుకుందామా?

Women Cricketer Trisha Poojitha In Bhadradri Kothagudem
Women Cricketer Trisha Poojitha

తెలుగు అమ్మాయికి మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో చోటు

Bhadradri Cricketer Trisha Poojitha WPL 2024 : అమ్మాయిలంటే వంటింటి కుందేళ్లు కాదని ఎలాగైనా మంచి పేరు, ప్రతిష్ఠలు సాధించాలని చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యంతో పెరిగిందామ్మాయి. అందుకు క్రికెట్‌నే మార్గంగా ఎంచుకుంది. సహజంగా ఈ క్రీడలో మహిళలకు కుటుంబాల నుంచి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ఆటలో తాను ఒక దిక్సూచిగా నిలవాలని నిర్ణయించుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఈ యువ క్రీడాకారిణి. ప్రాక్టీస్‌ చేస్తోన్న అమ్మాయి పేరు త్రిషా పూజిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం. సోదరుడి స్ఫూర్తితో క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంది.

Cricketer Trisha Poojitha in WPL : మిథాలీ రాజ్‌ స్థాయికి ఎదగాలని కలలు కంది. ప్రతిభను నమ్ముకుంటూ, అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తోంది. 12 ఏళ్లకే హైదరాబాద్ జట్టుకు ఎంపికైన ఈ భద్రాచలం అమ్మాయి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన స్వప్నం సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమించింది త్రిష. హైదరాబాద్ మహిళల టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. భవిష్యత్‌లో జాతీయ సీనియర్ జట్టుకు ఆడాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది. త్వరలో మొదలు కాబోతున్న డబ్యూపీఎల్​లో గుజరాత్ జెయింట్స్‌కి ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అక్కడ సత్తా చాటి మరింత వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

WPL 2023 : రెండేళ్ల పాపను వదిలి.. సమరానికి సై అంటున్న తెలుగు క్రికెటర్

Gujarat Giants Cricketer Trisha Poojitha : ఎనిమిదేళ్లకే కెరీర్ మొదలు పెట్టిన త్రిష అప్పటి నుంచి అండర్-16, 19, 23 విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. హైదరాబాద్‌ అండర్‌-23 మహిళల జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహిస్తోంది. రోజుకు 7, 8 గంటలు ప్రాక్టీస్​లో నిమగ్నమవుతోంది. ప్రస్తుత పోటీ వాతావారణాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా శిక్షణ తీసుకుంటోంది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్ర అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది త్రిష. చిన్న వయసులోనే బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది. అయిదేళ్లలో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తోందీ యువతి. క్రికెట్‌లో త్రిష ఈ స్థాయికి ఎదగడానికి కుటుంబం ఎంతగానో ప్రోత్సాహన్నిచింది.

రాధ కథ: క్రికెట్​ మైదానంలో వికెట్ల సాగు

బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : ఉహ తెలియని వయసులో అన్నయ్య క్రికెట్ ఆడటం చూసి తను ఆట పట్ల ఆసక్తి పెంచుకుందని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లైనా సమస్యలకు వెనకడుగు వేయలేదని భవిష్యత్తులో భారత జట్టులో చోటు దిశగా అడుగులేస్తున్న కూమార్తెను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. ఒకవైపు చదువులో రాణిస్తూ మరోవైపు క్రికెట్‌లో అదరగొడుతున్న త్రిష పూజితపై అందరి నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. రాబోయే కాలంలో భారత జట్టులో ఆడటానికి నిరంతర సాధన చేస్తున్న ఈ యువ క్రికెటర్‌కి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం.

సచిన్​తో బ్యాట్​ అందుకొని​... డబుల్​ సెంచరీ బాదేశాడు

'టీమిండియా బౌలర్​ అశ్విన్​ గొప్ప స్పిన్నర్​ కానీ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.