ETV Bharat / state

ఏసీబీ వలలో జమ్మికుంట తహశీల్దార్​ రజిని - అక్రమాస్తులు రూ.12 కోట్లకు పైమాటే!

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 10:34 PM IST

ACB Officials Arrest Jammikunta Tehsildar Rajini : ఏసీబీ అధికారులు మరోసారి తమ పంజా విసిరారు. అక్రమంగా సంపాదిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతున్నారు. తాజాగా కరీంనగర్​ జిల్లా జమ్మికుంట తహశీల్దార్​ రజిని ఇంట్లో సోదాలు చేపట్టి సోదాలు బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు హనుమకొండలోని ఎమ్మార్వో నివాసంలో తనిఖీలు నిర్వహించారు. తహశీల్దార్​ బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ACB Officials Arrest Jammikunta Tehsildar Rajini
ACB Officials Arrest Jammikunta Tehsildar Rajini

ఏసీబీ వలలో జమ్మికుంట తహశీల్దార్​ రజిని - అక్రమాస్తులు రూ.12 కోట్లకు పైమాటే

ACB Officials Arrest Jammikunta Tehsildar Rajini : అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటూ, అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​ జిల్లా జమ్మికుంట తహశీల్దార్​గా పని చేస్తున్న రజిని నివాసంలో ఏసీబీ(ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్​ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు, స్థానిక అధికారులు హనుమకొండ కేఎల్​ఎన్​ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటల సేపు ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు చేయగా విలువైన పత్రాలను గుర్తించారు. మొత్తం రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.12 కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

ACB Rides Jammikunta Tehsildar Rajini House : రెండు అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, ఏడెకరాల వ్యవసాయ భూమి అక్రమాస్తులుగా గుర్తించామని పేర్కొన్నారు. అలాగే కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తహశీల్దార్​ రజిని(Jammikunta Tehsildar Rajini)ని అరెస్టు చేసి కరీంనగర్​ ఏసీబీ కోర్టుకు రిమాండ్​ నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు.

"ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టాం. ఈ సోదాల్లో విలువైన పత్రాలు, రూ.3 కోట్లపైనే అక్రమాస్తులు గుర్తించాం. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్​లో రూ.12 కోట్లు పైమాటే. కిలోన్నర బంగారం, రూ.25 లక్షల నగదు పట్టుకున్నాం. తహశీల్దార్​ను కరీంనగర్​ ఏసీబీ కోర్టుకు రిమాండ్​ నిమిత్తం తరలిస్తున్నాం." - రమణమూర్తి, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ

ఏసీబీ అధికారులకు గాయాలు : ప్రస్తుతం జమ్మికుంట తహశీల్దార్​గా పని చేస్తున్న రజిని గతంలో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ధర్మసాగర్​ ఎమ్మార్వోగా పని చేయడంతో అక్కడా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ధర్మసాగర్​ నుంచి ఓ బృందం ప్రయాణించే వాహనం మడికొండ వద్ద ప్రమాదానికి గురైయింది. ఐదుగురు అధికారులకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గొర్రెల పంపిణీ స్కామ్​ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ

ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారిణి - రూ.84వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.