ETV Bharat / sports

'యశస్వి క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ'- జైశ్వాల్ జర్నీ '12th ఫెయిల్' సినిమాలాంటిదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 12:43 PM IST

Updated : Feb 3, 2024, 3:42 PM IST

Yashasvi jaiswal Manoj sharma: యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ప్రస్తుతం ఇంటర్నెట్​లో ట్రెండింగ్​లో ఉన్నాడు. జైశ్వాల్, 12th ఫెయిల్ సినిమా మనోజ్ శర్మ క్రికెట్ వెర్షన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్​లు షేర్ చేస్తున్నారు.

Yashasvi jaiswal Manoj sharma
Yashasvi jaiswal Manoj sharma

Yashasvi jaiswal Manoj sharma: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కెరీల్​లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. విశాఖపట్టణం వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో జైశ్వాల్ టీమ్ఇండియాలో అతి చిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాటర్​గా నిలిచాడు. దీంతో క్రీడావర్గాల్లో ప్రస్తుతం జైశ్వాల్ పేరు మార్మోగిపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ జైశ్వాల్ పేరు ట్రెండింగ్​లో ఉంది.

అయితే రీసెంట్ బ్లాక్​బస్టర్ 12th ఫెయిల్ సినిమా హీరో మనోజ్ శర్మ క్యారెక్టర్​తో జైశ్వాల్ కెరీర్​ జర్నీని పోలుస్తూ నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. 'యశస్వి జైశ్వాల్ క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ' అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జైశ్వాల్ కూడా కెరీర్ ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జన్మించిన జైశ్వాల్, కెరీర్​లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. దీంతో అతడి లైఫ్​ కూడా మనోజ్ శర్మలాగే సాగిందని నెటిజన్లు అంటున్నారు.

ఏంటీ 12th ఫెయిల్ సినిమా? మనోజ్ శర్మ అనే ఐపీఎస్ అధికారి రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన సినిమాయే '12th ఫెయిల్'. మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో జన్మించిన మనోజ్ కుమార్ శర్మ 12వ తరగతి ఫెయిలైనప్పటికీ, ఐపీఎస్ ఉద్యోగం ఎలా సంపాదించారు? ఈ జర్నీలో ఆయనుకు ఎదురైన కష్టాలేంటి? వాటిన్నంటిని ఎలా ఎదుర్కొన్నారు. ఎలా సక్సెస్ సాధించారు? అనే అంశాల్ని సినిమాలో చూపించారు. అయితే ప్రస్తుతం జైశ్వాల్ కూడా అలాగే కెరీర్​లో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ అందుకున్నాడని అంటున్నారు.

సెహ్వాగ్​ను గుర్తుచేసిన జైశ్వాల్: ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 396 పరుగులు చేసింది. అందులో యశస్వి ఒక్కడివే 209 పరుగులు విశేషం. అతడు తప్ప మిగతా బ్యాటర్లెవరూ హాఫ్ సెంచరీ మార్క్ కూడా అందుకోలేదు. దీంతో అందరికీ 2008 నాటి భారత్- శ్రీలంక టెస్టు మ్యాచ్​ గుర్తుకువచ్చింది. గాలే వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే జట్టును ఆదుకున్నాడు.​ సచిన్ (5), ద్రవిడ్ (2), గంగూలీ (0), లక్ష్మణ్ (39), దినేశ్ కార్తిక్ (7) ఇలా అందరూ సింగిల్ డిజిట్​కే పరిమితం కాగా, సెహ్వాగ్ ఒక్కడే (201) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఆ మ్యాచ్​లో గంభీర్ (56) సెకండ్ టాప్ స్కోరర్.

యార్కర్ కింగ్ ఈజ్ బ్యాక్- 'బుమ్రా' బంతికి పోప్ క్లీన్​బౌల్డ్- వీడియో చూశారా?

యశస్వి 'డబుల్' ధమాకా- మూడో బ్యాటర్​గా రికార్డ్

Last Updated :Feb 3, 2024, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.