ETV Bharat / sports

WPLలో తెలుగమ్మాయిలు- వీరిలో సత్తా చాటేదెవరో?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 7:18 PM IST

Telugu Cricketers WPL
Telugu Cricketers WPL

Telugu Cricketers WPL: మహిళల ఐపీఎల్​ శుక్రవారం (ఫిబ్రవరి 23) పారంభం కానుంది. ఈ టోర్నీలో రాణించి, టీమ్ఇండియా తలుపుతట్టాలని అనేక మంది యంగ్ ప్లేయర్లు ఆశిస్తారు. అయితే ప్రస్తుత టోర్నీలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు క్రికెటర్లెవరో మీకు తెలుసా?

Telugu Cricketers WPL: 2024 డబ్ల్యూపీఎల్​కు రంగం సిద్ధమైంది. ఈరోజు (ఫిబ్రవరి 23) రెండో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్​తో టోర్నీకి తెరలెవనుంది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మన తెలుగమ్మాయిలూ సిద్ధమయ్యారు. మరి వారెవరో చూసేద్దాం.

అంజలి శర్వాణి: యువపేసర్ అంజలి శర్వాణిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా జట్టుపై అంజలి శర్వాణి క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు ఆమె ఆరు మ్యాచ్​లు ఆడగా మూడు వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించింది. తక్కువ వికెట్లే తీసినా, పొదుపుగా, మంచి స్పీడ్​తో బౌలింగ్ చేయడం అంజలి స్పెషాలిటీ. ఈమె ఈ టోర్నీలో యూపీ వారియర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈమెను యూపీ రూ. 55లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు ప్లేయర్​ అంజలీయే.

అరుంధతిరెడ్డి: అరుంధతి రెడ్డి ఇప్పటికే టీమ్ఇండియాకు 26 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించింది. డబ్ల్యూపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది. ఈమెను దిల్లీ రూ.30లక్షలకు దక్కించుకుంది.

సబ్బినేని మేఘన: సబ్బినేని మేఘన బ్యాట్​తో అదరగొడుతుంది. ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టి20ల్లో టీమ్ఇండియాకి ప్రాతినిధ్యం వహించింది. ఈమెను గుజరాత్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రూ.30లక్షలకు కొనుగోలు చేసింది.

గౌహర్ సుల్తానా: గౌహర్ సుల్తానా టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్​లు ఆడిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు. సుల్తానా స్వస్థలం హైదరాబాద్. సల్తానా ఇప్పటివరకు 50 వన్డేలు, 37 టీ20ల్లో ఆడింది. 35ఏళ్ల వయసులో ప్రస్తుత డబ్ల్యూపీఎల్​లో యూపీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

యశశ్రీ: యశశ్రీని యూపీ వారియర్స్ గతేడాది రూ.10లక్షలతో కొనుగోలు చేసింది. ఆ సీజన్​లో ఒక్క మ్యాచ్​లోనే ఆడే ఛాన్స్ వచ్చింది. ఈ తర్వాత ఈ హైదరాబాదీ పేసర్​కు మరో ఛాన్స్ రాలేదు. మంచి వేగంతో బౌలింగ్ చేసే యశశ్రీ ఈసారి తనకు తగినన్ని ఛాన్సులు వస్తాయని ఆశిస్తోంది.

స్నేహదీప్తి: 16ఏళ్ల వయసులోనే టీ20 మ్యాచ్ ఆడి భారత్ తరపున ఈ ఘనత సాధించిన చిన్న వయస్కురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత షెఫాలీ వర్మ రికార్డును బ్రేక్ చేసింది. భారత్​కు ఆడిన 2 టీ20లు, ఒక వన్డేలో ఆమె రాణించకపోవడం వల్ల చోటు కోల్పోయింది. ఇప్పుడు డబ్య్లూపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది.

షబ్నం షకిల్: మీడియం పేసర్ షబ్నం షకిల్, బ్యాటర్ త్రిష పూజిత కూడా ఈ లీగ్​లో ఛాన్స్ వస్తే సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో లీగ్ ముగిసేసరికి ఎంతమంది పేర్లు మారుమోగుతాయో చూడాల్సిందే.

గెట్​రెడీ క్రికెట్​ ఫ్యాన్స్- WPL ఓపెనింగ్ సెర్మనీకి స్టార్ హీరో- ఈసారి మరింత గ్రాండ్​గా

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.