ETV Bharat / sports

అలా జరగడానికి 'ఇది రోహిత్ శర్మ ముంబయి కాదు'- MI హ్యాట్రిక్ ఓటములపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Sehwag On Mumbai Lost

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 7:19 PM IST

Sehwag On Mumbai Lost
Sehwag On Mumbai Lost

Sehwag On Rohit Sharma Captaincy: ప్రస్తుత ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన పట్ల సోషల్ మీడియాలో కెప్టెన్ హార్దిక్​పై ట్రోల్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ వీరెంద్ర సెహ్వాగ్ ఈ విషయంపై స్పందించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Sehwag On Rohit Sharma Captaincy: ఐపీఎల్​లో స్టార్ టీమ్ ముంబయి ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్​లో ముంబయి వరుసగా మూడు మ్యాచ్​ల్లో ఓడి ఇంకా పాయింట్లు ఖాతా తెరవలేదు. ఈ క్రమంలో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కాగా, దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ ఒత్తిడిని తట్టుకొని ఎలా కమ్​బ్యాక్ ఇస్తాడో చూడాలన్నాడు.

'ఆయా సీజన్​లలో ముంబయి ఇండియన్స్ ప్రారంభంలో వరుసగా 3-4 మ్యాచ్​ల్లో ఓడినా తర్వాత మంచి కమ్​బ్యాక్ ఇచ్చేది. అలాంటి పరిస్థితుల నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్ చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అది రోహిత్ శర్మ ముంబయి. ఇప్పుడుంది హార్దిక్ పాండ్య ముంబయి. ప్రస్తుత పరిస్థితులను, ఒత్తిడిని అధిగమించి అతడు ఎలాంటి కమ్​బ్యాక్ ఇస్తాడో చూడాలి' అని సెహ్వాగ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే గతంలో పలు సీజన్​లలో వరుసగా నాలుగు, ఐదు మ్యాచ్​ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు గొప్పగా పుంజుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్​కు కూడా అర్హత సాధించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కెప్టెన్​గా ఉన్న రోహిత్ శర్మ ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకొని జట్టును నడిపించాడని సెహ్వాగ్ అన్నాడు.

ఇక ప్రస్తుత సీజన్​లో గుజరాత్​తో ఆడిన తొలి మ్యాచ్​లో పోరాడిన ముంబయి కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాత సన్​రైజర్​ హైదరాబాద్​ మ్యాచ్​లో పేలవ బౌలింగ్​తో భారీగా స్కోర్ సమర్పించుకుంది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ స్కోర్ (277 పరుగులు) నమోదు చేయగా, ఛేదనలో ముంబయి 245 పరుగులు చేసింది. తాజాగా రాజస్థాన్​తో మ్యాచ్​లో ముంబయి ఘోర ఓటమి మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలో ఛేదించి విజయాల్లో హ్యాట్రిక్ కొట్టగా, ముంబయి ఓటముల్లో హ్యాట్రిక్ అందుకుంది.

రాజస్థాన్​ మ్యాచ్​లో రోహిత్ శర్మనే భయపెట్టేసిన అభిమాని - IPL 2024 RR VS MI

'చాలా బాధగా ఉంది - అలా చేసి ఉంటే మరోలా ఉండేది' - Hardik Pandya IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.