ETV Bharat / sports

అప్పటిదాకా రాహుల్ కంటిన్యూ- ద్రవిడ్ పదవీకాలంపై జై షా క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 10:59 AM IST

Updated : Feb 15, 2024, 11:22 AM IST

Rahul Dravid Coach T20 World Cup
Rahul Dravid Coach T20 World Cup

Rahul Dravid Coach T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్ వరకూ రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్​గా కొనసాగుతాడని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు.

Rahul Dravid Coach T20 World Cup: టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ద్రవిడ్‌ 2024 టీ20 ప్రపంచకప్‌ వరకు టీమ్ఇండియా హెడ్​ కోచ్​గా కొనసాగుతాడని షా వెల్లడించారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్‌ టోర్నమెంట్​ తర్వాత ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ ముగిసిపోయింది. అయితే డిసెంబర్‌- జనవరిలో జరిగిన సౌతాఫ్రికా పర్యటన వరకు ద్రవిడ్‌తోపాటు సపోర్టింగ్ స్టాఫ్​ కాంట్రాక్ట్‌ను పొడిగించినప్పటికీ ఎంతకాలం అనేది పేర్కొనలేదు. దీనిపై తాజాగా షా క్లారిటీ ఇచ్చారు.

'ద్రవిడ్ లాంటి సీనియర్ ప్లేయర్ కాంట్రాక్ట్​ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీ20 వరల్డ్​కప్​ దాకా ఆయనే కోచ్​గా ఉంటారు. 2023 వరల్డ్​కప్ తర్వాత రాహుల్ భాయ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ద్రవిడ్​ను కలవలేకపోయా. ఫైనల్​గా ఈరోజు కలుసుకున్నాం' అని షా అన్నారు. ఇక ఐపీఎల్​ గురించి కూడా షా వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్​లో అన్ని ఫ్రాంఛైజీలు బీసీసీఐ నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అధిష్ఠానమని గుర్తుంచుకోవాలని తెలిపారు. అయితే టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లపై పడే పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని షా ఈ వ్యాఖ్యలు చేశారు.

రోహితే మన కెప్టెన్: రోహిత్ శర్మ టీ20 వరల్డ్​కప్​ దాకా టీమ్ఇండియాకు కెప్టెన్​గా కొనసాగుతాడని షా రీసెంట్​గా స్పష్టం చేశారు. గుజరాత్​లో జరిగిన ఓ ఈవెంట్​లో పాల్గొన్న షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.'2024లో బార్బడోస్ గ్రౌండ్​లో రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 వరల్డ్​కప్ గెలుస్తుంది' అని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

T20 World Cup 2024: 2024 జూన్​లో పొట్టి ప్రపంచకప్​ జరగనుంది. ఈ టోర్నమెంట్​కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.20 జట్లు ఈ పొట్టి కప్​లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. టీమ్ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జూన్‌ 5 ప్రారంభమవుతాయి. అయితే, ఇంకా అధికారిక షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. కానీ, క్రికెట్‌ వర్గాల ప్రకారం భారత్- పాకిస్థాన్‌ జట్ల మధ్య జూన్ 9న మ్యాచ్‌ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

మూడో టెస్ట్​కు సర్వం సిద్ధం - రాజ్​కోట్ ఎవరిదో?

Last Updated :Feb 15, 2024, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.