ETV Bharat / sports

మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియానే నెం.1- ర్యాంకింగ్స్​లో భారత్ డామినేషన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 12:25 PM IST

Updated : Mar 10, 2024, 1:57 PM IST

Men's Test Team ranking 2024: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా ఆదివారం టాప్​లోకి దూసుకెళ్లింది. రీసెంట్​గా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​ నెగ్గడం వల్ల భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.

Men's Test Team ranking 2024
Men's Test Team ranking 2024

Men's Test Team ranking 2024: టీమ్ఇండియా టెస్టు ర్యాంకింగ్స్ (ICC Test Team Ranking)​లో అగ్రస్థానానికి దూసుకెళ్లింగి. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్​లో భారత్ ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్​ పొజిషన్​కు చేరుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో 4-1తేడాతో నెగ్గడం వల్ల భారత్, ఆస్ట్రేలియాను అధిగమించింది. ప్రస్తుతం భారత్ 122 రేటింగ్స్​తో టాప్​లో ఉండగా, ఆసీస్ 117 రేటింగ్స్​తో రెండో పొజిషన్​లో ఉంది. ఇక వన్డే (121 రేటింగ్స్​), టీ20 (266 రేటింగ్స్​)లో కూడా టీమ్ఇండియాదే అగ్రస్థానం.

92 ఏళ్లలో తొలిసారి: భారత్ టెస్టుల్లో ఇప్పటివరకు 579 టెస్టు మ్యాచ్​లు ఆడింది. అందులో 178 మ్యాచ్​ల్లో నెగ్గగా, అన్నే మ్యాచ్​ల్లో ఓడింది. ఇక 222 మ్యాచ్​లు డ్రా చేసుకోగా 1 టెస్టు టై అయ్యింది. అయితే భారత టెస్టు ఫార్మాట్ హిస్టరీలో తొలిసారి విజయాలు, ఓటముల సంఖ్య సమానంగా వచ్చాయి. ఇన్నేళ్లు ఓటములు ఎక్కువగా ఉంటే, విజయాలు తక్కువగా ఉండేవి. అలా 92 ఏళ్లలో తొలిసారి ఓటమి, గెలుపు సంఖ్య సమానంగా ఉంది.

WTC Points Table 2023-25: ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (World Test Championship 2025)​లోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. 68.51 పాయింట్ శాతంతో టీమ్ఇండియా పట్టికలో టాప్​ ప్లేస్​లో ఉంది. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్​లో 9 మ్యాచ్​లు ఆడిన భారత్ 6 టెస్టుల్లో నెగ్గింది. రెండింట్లో ఓడగా, ఒక టెస్టును డ్రా చేసుకుంది. ఈ టేబుల్​లో న్యూజిలాండ్ 60.00 పాయింట్ శాతంతో రెండో పొజిషన్​లో ఉండగా, డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (59.09) మూడు, బంగ్లాదేశ్ (50.00) నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Test Match Fee Insentive: టెస్టు ఫార్మాట్​పై యంగ్ ప్లేయర్లకు ఆసక్తి పెంచే విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫీజుకు అదనంగా ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఈ లెక్కన ఒక సంవత్సర కాలంలో భారత్ 9 మ్యాచ్​లు ఆడుతుందని అనుకుంటే, అందులో 4 టెస్టు​లకంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఈ ఇన్సెంటివ్ వర్తించదు. 50 శాతం అంటే 5-6 మ్యాచ్​లు ఆడిన ప్లేయర్ రూ.30 లక్షలు అందుకుంటాడు. సిరీస్​కు ఎంపికై తుది జట్టులో లేకపోయినా రూ.15 లక్షలు దక్కుతాయి. ఇక 7 అంతకంటే ఎక్కువ (75 శాతం) మ్యాచ్​లు ఆడిన ఆటగాడికి బీసీసీఐ అత్యధికంగా రూ.45 లక్షలు చెల్లించనుంది. ఇందులో కూడా బెంచ్​కు పరిమితమైనా రూ.22.50 లక్షలు అందుకుంటారు. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్​కు బేసిక్ ఫీజు రూ.15 లక్షలు ఉంది.

ఆఖరి టెస్టు భారత్​దే- బజ్​బాల్​ను పిండేసిన రోహిత్ సేన, 4-1తో సిరీస్ కైవసం

టెస్టు ఫార్మాట్​ ఫీజు పెంచిన బీసీసీఐ- ఒక్కో మ్యాచ్​కు రూ.45 లక్షలు!

Last Updated :Mar 10, 2024, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.