ETV Bharat / sports

'విరాట్' అది ఫాలో అవ్వాల్సిందే- 'రోహిత్'​లా ఆడడం కుదరదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 8:32 AM IST

Updated : Jan 21, 2024, 9:02 AM IST

Krishnamachari On Virat Batting Style: అఫ్గానిస్థాన్​తో రీసెంట్​గా ముడో టీ20లో విరాట్ డకౌట్ అవ్వడం పట్ల మాజీ క్రెకెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. క్రీజులో విరాట్ దూకుడుగా కాకుండా తన గేమ్​ను ఫాలో అవ్వాలని సూచించాడు.

Krishnamachari On Virat Batting Style
Krishnamachari On Virat Batting Style

టీమ్ఇండియా స్వదేశంలో ఇంగ్లాండ్​తో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు సిద్ధమైంది. జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్​ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రెకెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల అఫ్గానిస్థాన్​తో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో విరాట్ డకౌట్​ (0) అవ్వడం పట్ల రోహిత్ స్పందించాడు. విరాట్ దూకుడుగా ఆడాలన్న ఉద్దేశంతో అలా ఔట్ అయ్యాడని రోహిత్ అన్నాడు. అయితే ఈ విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'ప్రతి ఆటగాడికి సొంత గేమ్ అంటూ ఒకటి ఉంటుంది. అతడు తన గేమ్​ను ఫాలో అవ్వాలి. అలా అని వీలైనంత సమయం తీసుకోమని యశస్వి జైశ్వాల్​ లాంటి కొత్త ప్లేయర్​కు చెప్పడం కరెక్ట్​ కాదు. అది రోహిత్​కు సరైన విధానం. రోహిత్ అరంభం నుంచే దూకుడుగా ఆడగలడు. కానీ, విరాట్ కోహ్లీ నేచురల్ గేమ్ ఆడాలి. క్రీజులో వీలైనంత సమయం తీసుకోవాలి. అంతేగాని సిక్స్​ల కోసం అందోళన చెందాల్సిన పని లేదు. మ్యాచ్ చివర్లో ఇన్నింగ్స్​ను ఎలా బూస్ట్​ చేయాలో విరాట్​కు తెలుసు. ఆఖర్లో సిక్స్​లు కూడా కొట్టగలడు. అతడికి ఆ సామర్థ్యం ఉంది. 2022 టీ20 వరల్డ్​కప్​లో మెల్​బోర్న్​లో అతడి ఇన్నింగ్స్​ అలాంటిదే. అందుకే విరాట్ తన స్టైల్​లోనే (నేచురల్​గా) ఆడాలి' అని కృష్ణమాచారి అన్నాడు.

ఇంగ్లాడ్ టెస్టు సిరీస్ షెడ్యుల్:

  • తొలి టెస్టు- జనవరి 25- 29
  • రెండో టెస్టు- ఫిబ్రవరి 02- 06
  • మూడో టెస్టు- ఫిబ్రవరి 15- 19
  • నాలుగో టెస్టు- ఫిబ్రవరి 23- 27
  • ఐదో టెస్టు- మార్చి 07- 11

ఈ సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​లకు బీసీసీఐ రీసెంట్​గా భారత జట్టును ప్రకటించింది. యంగ్ ప్లేయర్ ధృవ్ జురెల్​కు తొలిసారి టీమ్ఇండియాలో చోటు దక్కింది.

తొలి రెండు మ్యాచ్​లకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్​దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ సిరీస్​కు ముందు శ్రీకర్ భరత్​ సెంచరీ - సెలక్టర్లకు హింట్​!

రంజీలోమరో గోల్డెన్‌ డక్‌ - రహానె ఫ్యాన్స్​ టెన్షన్​!

Last Updated : Jan 21, 2024, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.