ETV Bharat / sports

జడేజా, కేెఎల్​ రాహుల్​ను వీడని గాయాలు- 36 నెలల్లో 11సార్లు ఆటకు దూరం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 9:18 AM IST

Kl Rahul Ravindra Jadeja Injuries : భారత్​ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ప్రధాన బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. గత మూడేళ్లలో వారిద్దరూ ఆడిన మ్యాచ్​ల కంటే గాయాల వల్ల దూరంగా ఉన్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.

Etv Bharat
Etv Bharat

Kl Rahul Ravindra Jadeja Injuries : భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ప్రధాన బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. గత 36 నెలల్లో వీరిద్దరూ 11 సార్లు గాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో భారత్‌ తరఫున వాళ్లు ఆడిన మ్యాచ్‌ల కంటే దూరంగా ఉన్నవే ఎక్కువ.

రవీంద్ర జడేజాకు 2021లో రెండు సార్లు గాయాలయ్యాయి. అలానే 2022లోనూ రెండుసార్లు గాయాలతో జడేజా జట్టుకు దూరమయ్యాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత విరామం ఆ రెండు సంవత్సరాల్లో వచ్చింది. తాజాగా తొడ కండరాల గాయంతో ఇంగ్లాండ్‌తో టెస్టు నుంచి వైదొలిగాడు. ఈసారి కూడా ఎక్కువ రోజులే ఆటకు దూరమయ్యేలా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో జడేజా మళ్లీ కనిపించకపోవచ్చు.

మరోవైపు కేఎల్​ రాహుల్​ది కూడా అదే పరిస్థితి. 2021 జనవరిలో మణికట్టు గాయంతో, మే నెలలో అపెండిసైటిస్‌ వల్ల, నవంబరులో తొడకండరాల గాయంతో రాహుల్‌ బాధపడ్డాడు. 2022 జూన్‌లో అతడికి గజ్జల్లో, 2023 మే నెలలో ఐపీఎల్‌ ఆడుతుండగా తొడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నాలుగు నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో తిరిగి ఫిట్‌నెస్‌ సాధించాడు. పునరాగమనంలో నిలకడగా ఆడుతున్న రాహుల్‌ ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా తొడ కండరాల గాయం మళ్లీ రావటం వల్ల రెండో టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టుకైనా రాహుల్ వస్తాడా, లేగా అన్నది సందేహంగానే ఉంది.

Ind Vs Eng 2nd Test 2024 : గాయాల కారణంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్​ రెండో టెస్ట్ మ్యాచ్​కు దూరం అయ్యారు. దీంతో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఈ రెండో టెస్టు కోసం ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులోకి చేర్చింది. ఎప్పటి నుంచో జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముంబయి బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్​కు ఛాన్స్​ ఇచ్చారు సెలక్టర్లు. ఇతడితో పాటు యూపీ ఆల్‌రౌండర్‌ సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఈ రెండో టెస్ట్​ మ్యాచ్​ ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో టీమ్​ ఇండియా పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్​ 202 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ క్రికెట్లర కెరీర్​లో ఆ ఒక్కటే లోటు!

రాహుల్, అతియా సర్​ప్రైజ్​ - సినిమాటిక్​ టచ్​తో పెళ్లి వీడియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.