ETV Bharat / sports

అశ్విన్, జడ్డూ మెరుపులు - 145కి ఇంగ్లీష్​ జట్టు ఆలౌట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 4:09 PM IST

Updated : Feb 25, 2024, 5:46 PM IST

Ind vs Eng 4th Test : రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్ల్​లో ఇంగ్లీష్‌ జట్టు 145కి ఆలౌటైంది. దీంతో ఆ జట్టు టీమ్ఇండియాకు 192 పరుగుల టార్గెట్​ను ఫిక్స్ చేసింది.

Ind vs Eng 4th Test
Ind vs Eng 4th Test

Ind vs Eng 4th Test : నాలుగో టెస్టులో భారత్‌ టార్గెట్‌ను 192 పరుగులుగా ఇంగ్లాండ్‌ ఫిక్స్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ జట్టు 145కి ఆలౌటైంది. ఇక ఇంగ్లీష్​ జట్టులో జాక్‌ క్రాలే (60) టాప్‌ స్కోరర్​గా నిలవగా, అదే జట్టుకు చెందిన బెయిర్‌స్టో (30), బెన్‌ డకెట్(15), జోరూట్‌ (11), ఫోక్స్‌ (17)లు డబుల్ డిజిట్​ స్కోర్ చేశారు. వీరు మినహా మిగతా ఎవరూ రెండంకెల పరుగులు చేయలేకపోయారు.

మరోవైపు భారత బౌలర్లలో అశ్విన్‌ 5, కుల్‌దీప్‌ 4, జడేజా ఒక వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 స్కోర్ చేయగా, భారత్‌ 307 పరుగులు సాధించింది.

ఇక ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (24*), యశస్వి జైస్వాల్ (16*) ఉన్నారు. అయితే టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం.

రాంచీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్​లో నమోదైన రికార్డులు ఇవే

  • రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఐదు వికెట్లతో చెలరేగడం ఇది 35వ సారి. దీంతో ఈ లిస్ట్​లో ఇప్పటికే టాప్​లో ఉన్న కుంబ్లేతో అశ్విన్ సమంగా నిలిచాడు. అయితే, అశ్విన్‌ ఈ రికార్డును 99 మ్యాచుల్లో సాధించగా, కుంబ్లే 132 టెస్టులు తీసుకున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు, షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైఫర్ తీశారు.
  • ఇంగ్లీష్ ప్లేయర్లు బెన్‌ స్టోక్స్ - మెక్‌కల్లమ్‌ సారథ్యంలో ఆ జట్టు 3 రన్‌రేట్‌ కంటే తక్కువగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అత్యల్పంగా 3.13 రన్‌రేట్‌తో చేయగా, ఈ మ్యాచ్‌లో 2.69 రన్‌రేట్‌తోనే ఆడటం గమనార్హం.
  • భారత్‌ వేదికగా జరిగిన టెస్టుల్లో ఆతిథ్య జట్టు ఏదీ 200 కంటే తక్కువైన టార్గెట్‌ను కాపాడుని గెలిచిన రికార్డులు లేవు. ఇప్పటి వరకు 32 సందర్భాల్లో మూడుస్లారు డ్రా కాగా, 29 మ్యాచుల్లో ఓడాయి.
  • టెస్టుల్లో 4000+ పరుగులు చేసిన ఆటగాడిగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 58 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు.

యశస్వి రికార్డుల మోత- సెహ్వాగ్​ను దాటి, గావస్కర్ సరసన జైశ్వాల్

భారత్xఇంగ్లాండ్- పడిలేచిన టీమ్ఇండియా- డే 2 కంప్లీట్

Last Updated : Feb 25, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.