ETV Bharat / sports

ఆసియా బ్యాడ్మింటన్​లో సింధు అదుర్స్- 3-2 తేడాతో చైనాపై భారత్ విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 4:31 PM IST

Updated : Feb 14, 2024, 5:23 PM IST

Asia Badminton Championship 2024
Asia Badminton Championship 2024

Asia Badminton Championship 2024: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్​షిప్స్​ 2024 నాకౌట్​లో భారత్ మహిళలు అదరగొట్టారు. తొలి గేమ్​లోనే స్టార్ షట్లర్ సింధు టాప్ సీడ్ చైనీస్ ప్లేయర్​ను ఓడించి టీమ్​కు లీడ్ ఇచ్చింది.

Asia Badminton Championship 2024: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదిరిపోయే కమ్​బ్యాక్ ఇచ్చింది. నాలులు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్​షిప్స్​ 2024లో మహిళల సింగిల్స్​లో చైనీస్ టాప్ సీడ్ హాన్ యుతో తలపడ్డ సింధు ఆటను 40 నిమిషాల్లోనే ముగించింది. హాన్ యుపై సింధు 21-17, 21-15 తేడాతో నెగ్గింది. దీంతో ఛాంపియన్​షిప్స్​ నాకౌట్​లో చైనాతో తలపడ్డ భారత్ తొలి మ్యాచ్​లోనే నెగ్గి 1-0 లీడ్​లోకి దూసుకెళ్లింది.

తర్వాత రెండో గేమ్​ డబుల్స్​లో తానిషా- అశ్విని పొన్నప్ప చైనా ద్వయం లియూ షెంగ్- తాన్ నింగ్​ చేతిలో 19-21 16-21 తేడాతో ఓడారు. ఇక సింగిల్స్​లో ప్రపంచ నెం.9 ర్యాంకర్​ వాంగ్​ జి ఈపై భారత షట్లర్ అష్మితా చలిహా 13-21 15-21 పరాజయం చవి చూసింది. దీంతో చైనా 1-2తో లీడ్​లోకి వెళ్లింది. నాలుగో గేమ్​ డబుల్స్​లో తీస్రా జాలీ- గాయత్రి గోపిచంద్ చైనీస్ ద్వయం లియి జింగ్​- లువో మిన్​తో తలపడ్డారు. గంటా 9నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో ఆఖరికి భారత ద్వయానిదే పైచేయి అయ్యింది. ఈ గేమ్​లో చైనాపై 10-21 21-18 21-17 తేడాతో తీస్రా- గాయత్రి ద్వయం నెగ్గడం వల్ల భారత్ 2-2తో సమం చేసింది.

డిసైడర్ గేమ్ సింగిల్స్​​లో 17ఏళ్ల అన్​మోల్ ఖర్బ్​ సంచలనం సృష్టించింది. వరల్డ్​ 472 ర్యాంకరైన అన్​మోల్, ప్రపంచ 149 ర్యాంకర్ లియో యుపై 22- 20, 14- 21, 21-18 తేడాతో నెగ్గి భారత్​కు చరిత్రాత్మక విడయం కట్టబెట్టింది. దీంతో ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ నాకౌట్​లో భారత్ 3-2తో విజయం సాధించి క్వాటర్ ఫైనల్స్​కు చేరుకుంది.

మరోవైపు పురుషుల జట్టు కంప్లీట్ డామినెన్స్ చూపించింది. తొలి గేమ్ సింగిల్స్​లో ప్రణయ్, లాంగ్ అంగుస్ చేతిలో 18-21 14-21 తేడాతో ఓడినప్పటికీ, తర్వాత మ్యాచ్​ల్లో భారత్​దే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్​లో లక్ష్యసేన్ 21-14 21-9 తేడాతో చాన్ యిన్​పై నెగ్గగా, డబుల్స్​లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి 21-16 21-11 తేడాతో లియి చున్- యెంగ్ షింగ్​పై గెలుపొందారు. దీంతో మూడు మ్యాచ్​ల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత గేమ్స్​లోనూ భారత్ అదే జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు, ఐదు గేమ్స్​లో అర్జున్- ధ్రువ్ కపిల 21-12 21-7 (డబుల్స్​)తో, కిదాంబి శ్రీకాంత్ (సింగిల్స్​) 21-14 21-18 తేడాతో నెగ్గడం వల్ల భారత్ 4-1తో ముగించింది.

ఫైనల్​లో తప్పని నిరాశ - పోరాడి ఓడిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ

రిలేషన్​షిప్​ స్టేటస్​పై స్పందించిన పీవీ సింధు- 'లవ్​ లైఫ్​' గురించి క్లారిటీ!

Last Updated :Feb 14, 2024, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.