ETV Bharat / spiritual

మహాశివరాత్రి నాడు ఈ సంకేతాలు కనిపిస్తే - మీకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:53 AM IST

Good Signs on Maha Shivaratri: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రోజున శివభక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తారు. అయితే.. శివరాత్రి రోజున మీకు ఈ సంకేతాలు కనిపిస్తే పరమశివుని అనుగ్రహం పొందినట్టేనని.. అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Good Signs on Maha Shivaratri
Good Signs on Maha Shivaratri

These Signs Indicates Good on Maha Shivaratri: మహా శివరాత్రి రోజున దేశంలోని శైవక్షేత్రాలన్నీ.. శివనామస్మరణతో మార్మోగుతాయి. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండగ ప్రత్యేకం. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణతో.. భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. భక్తులందరూ ప్రత్యేక పూజలతోపాటు కఠిన ఉపవాస దీక్షనూ కొనసాగిస్తారు. అలాగే రాత్రంతా జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తులంతా నమ్ముతారు. అయితే.. శివరాత్రి రోజున ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు పరమశివుని అనుగ్రహంతో పాటు అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మహాశివరాత్రి ఎప్పుడంటే: పురణాల ప్రకారం.. మహాశివరాత్రిని మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మరి..శివరాత్రి రోజున కనిపించే సంకేతాలు ఏంటంటే..

మహా శివరాత్రి స్పెషల్- అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి!

పాము దర్శనం: పండితుల ప్రకారం.. మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు లేదా పండగ నాడు నల్ల త్రాచు లేదా ఇతర ఏదైనా పాము కనిపిస్తే.. ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పామును చూడటం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

రుద్రాక్ష: మహా శివరాత్రి నాడు శివుని పూజ అనంతరం రుద్రాక్ష దర్శనం మంచిదని పండితులు చెబుతున్నారు. పండగ నాడు రుద్రాక్షను దర్శించుకోవడం శుభప్రదమని, ఆ నీలకంఠుడి ఆశీర్వాదం లభిస్తాయని తెలుపుతున్నారు. అలాగే శివరాత్రి ముందు రోజు రుద్రాక్షను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తోందని స్పష్టం చేశారు.

5 ఆకులతో కూడిన బిల్వపత్రం: మారేడుదళాన్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు. శివపూజకు బిల్వపత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రంధాల ప్రకారం, బిల్వ ద‌ళంలోని మూడు ఆకులు శివుని మూడు నేత్రాలను సూచిస్తాయి. అలనాడు భక్త కన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు. అయితే.. సాధారణంగా బిల్వపత్రం మూడు ఆకులు కనిపిస్తాయి. కానీ శివరాత్రి నాడు ఐదు ఆకులు కలిగిన బిల్వ పత్రాన్ని చూడటం అత్యంత అదృష్టమని, శుభాన్ని సూచిస్తుందని పండితులు అంటున్నారు.

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? మీకు తెలుసా?

మహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట!

మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.