ETV Bharat / politics

'ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది - మూడోసారి ప్రధాని అయ్యేందుకు మద్దతుగా నిలవండి' - Uttarakhand CM Campaign in State

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 5:07 PM IST

Updated : Apr 25, 2024, 5:30 PM IST

Uttarakhand CM Election Campaign
Uttarakhand CM Election Campaign in Nizamabad

Uttarakhand CM Election Campaign in Nizamabad : నిజామాబాద్​ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​కు మద్దతుగా ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్​ దామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్​లో ధర్మపురి అర్వింద్​ను భారీ మెజారిటీతో గెలిపించాలని, మూడోసారి మోదీ అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలబడాలని కోరారు.

'ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది - మూడోసారి ప్రధాని అయ్యేందుకు మద్దతుగా నిలవండి'

Uttarakhand CM Election Campaign in Telangana : ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని, మోదీ హయాంలో దేశం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ దామి అన్నారు. నిజామాబాద్​లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​లు హాజరయ్యారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో అర్వింద్ నామినేషన్​కు హాజరైన అనంతరం, పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

Lok Sabha Elections 2024 : ఈ సందర్భంగా దేశం మొత్తం అందరికీ ఒకటే నియమం ఉండాలని పుష్కర్​సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం పేదలకు పథకాలు, నిధులు అందవని, ఓ వర్గానికి దోచిపెడతారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. హిందువుల సొత్తును ముస్లింలకు దోచిపెడతారని దుయ్యబట్టారు.

నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్- డిపాజిట్ చెల్లించిన పసుపు రైతులు

ధర్మపురి అర్వింద్​కు ప్రజల ఆశీర్వాదం కావాలి. గత ఎన్నికల కంటే అధిక మెజారిటీతో అర్వింద్‌ను గెలిపించాలి. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లోనూ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. మూడోసారి మోదీ అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలబడాలి. మోదీ నేతృత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. - పుష్కర్​సింగ్​ ధామి, ఉత్తరాఖండ్​ సీఎం

నేడు మరో సెట్​ దాఖలు : అంతకుముందు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నేడు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ దామీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాకేశ్​ రెడ్డి, సూర్యనారాయణలు అర్వింద్ నామినేషన్​లో పాల్గొన్నారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగిన ఉత్తరాఖండ్ సీఎం, నేరుగా కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో అర్వింద్ నామినేషన్​లో పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది - తెలంగాణలోనూ వార్​ వన్​ సైడే : ధర్మపురి అర్వింద్

సిద్దిపేటలో అమిత్​ షా : నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియడంతో పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు బీజేపీ అభ్యర్థుల నేతల నామినేషన్లలో పాల్గొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్​ అభ్యర్థి రఘునందన్​ రావుకు మద్దతుగా కేంద్రమంత్రి అమిత్​ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీని మరోసారి ప్రధానిని చేయాలని, రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం : అమిత్‌షా

Last Updated :Apr 25, 2024, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.