ETV Bharat / politics

'కరప్షన్, కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ - ఈసారి తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నాం' - BJP Candidates Nominations

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 3:45 PM IST

Chevella Bjp Candidate Konda Nomination
Union Minister Piyush Goyal Election Campaign

Union Minister Piyush Goyal Election Campaign : సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల జాతర కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, రోడ్‌ షోలుగా వెళ్తూ ముఖ్య నేతల సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. పలువురు కేంద్రమంత్రుల సమక్షంలో కాషాయ దళం ఎంపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ సమక్షంలో ఆర్వో అధికారికి చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

'కరప్షన్, కుటుంబ పాలనకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ - రాహుల్ గాంధీ ఎప్పటికి ప్రధాని కాలేరు'

Chevella Bjp Candidate Konda Nomination : చేవెళ్లలో బీజేపీ విజయం తథ్యమని, లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 3 లక్షలకు పైగా ఓట్లు తమకు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించారని పేర్కొన్న ఆయన, చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ కార్యాలయంలో కొండా నామపత్రాలు దాఖలు చేశారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వర్‌రెడ్డి తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతా రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీకి దశ దిశ లేదన్న కొండా, రాజకీయాల కోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు.

Union Minister Piyush Goyal Comments : బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ రూ.100 ఇస్తే, దళారులు రూ.85 తిని రూ.15 మాత్రమే పేదలకు అందేవని అన్నారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని కరప్షన్, కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ సర్కార్ పని అయిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, తెలంగాణలో బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్- డిపాజిట్ చెల్లించిన పసుపు రైతులు - BJP MP Dharmapuri Arvind Nomination

"తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది. దేశంలో ఎన్టీయే కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయి. మోదీ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కలిసి లేవు. కాంగ్రెస్ సీపీఐతో కేరళలో కుస్తీ, దిల్లీలో దోస్తీ చేస్తోంది." - పీయూష్ గోయల్, కేంద్రమంత్రి

Nalgonda BJP MP Candidate Saidi Reddy Nomination : నల్గొండ కమలం పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌ వేశారు. నల్గొండ కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి సైదిరెడ్డి నామపత్రాలు అందజేశారు. జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ సైతం నామినేషన్‌ వేశారు. ముందుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గణేశ్‌గడ్డ దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన రిటర్నింగ్‌ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ సభకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు.

Union Minister Kiren Rijiju Attend in BJP Nomination Rally : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్. సీతారాం నాయక్ నామినేషన్​ను దాఖలు చేశారు. అనంతరం సీతారాం నాయక్ గెలుపు కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు పాల్గొని, ఆయనకు మద్దతు తెలిపారు.

గత 70 సంవత్సరాలుగా దేశంలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందని, కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యతను ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని విమర్శించారు. ఆదివాసీ, గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని, ఉద్యోగ, రాజకీయాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ముచ్చటగా 3వ సారి మోదీని ప్రధానమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతు రుణమాఫీకి - ఆగస్టు నెలకు సంబంధం ఏంటి : రఘునందన్ రావు - Raghunandan Rao Comments on CM

రుణమాఫీ అమలుకు పంద్రాగస్టు వరకు ఎందుకు? - గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ గారడీ చేస్తోంది : కిషన్​ రెడ్డి - Kishan Reddy on Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.