ETV Bharat / politics

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు! - lok sabha elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 8:01 AM IST

Updated : Mar 29, 2024, 9:30 AM IST

Telangana Congress Joinings 2024 : లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు, ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేపు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని వారితో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress
Congress

హస్తం గూటికి చేరతున్న కీలక నేతలు

Telangana Congress Joinings 2024 : కాంగ్రెస్‌ సర్కార్ త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు చేసిన ప్రకటనలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలాంటి కుట్రల్ని ఛేదిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం సహా పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా హస్తం పార్టీ అధిష్ఠానం చేరికలకు గేట్లు తెరిచింది.

TS Congress Operation Akarsh 2024 : ఇందులో భాగంగానే బీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన నాయకుల్ని వరుసగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. భారత్ రాష్ట్ర సమితి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ (TS Congress MP Candidates) బరిలో నిలిచారు. గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి వచ్చిన వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డికి మల్కాజిగిరి టికెట్‌ లభించింది. ఖైరతాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ దక్కించుకున్నారు.

ఆ 2 రాష్ట్రాల మోడల్​తో లోక్​సభ బరిలోకి కాంగ్రెస్ - బీజేపీని ఢీకొట్టేందుకు 'పాంచ్​ న్యాయ్​' అస్త్రం - Lok sabha elections 2024

కాంగ్రెస్‌లో చేరనున్న కేశవరావు : వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ హస్తం గూటికి చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకుని పదవి దక్కించుకున్నారు. గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (KK To Join Congress) కూడా బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను సుదీర్ఘ కాలం హస్తం పార్టీలో పనిచేశానని జీవిత చరమాంకంలో తిరిగి అదే పార్టీకి వెళ్లనున్నట్లు కేశవరావు స్పష్టంచేశారు.

అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని సమస్యలు పరిష్కరించడం సులువుగా ఉంటుందని హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి మీడియాతో ఇష్టాగోష్టిలో అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తన వెంట కార్పొరేటర్లు ఎవరినీ తీసుకుపోవడం లేదని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

Lok Sabha Elections 2024 : ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు హస్తం పార్టీ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బీజేపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు నిర్ధారించాయి.

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ప్రచార భేరీ - ఏప్రిల్‌ మొదటి వారంలో భారీ బహిరంగ సభ - Lok Sabha Elections 2024

TS Congress Focus on Joinings : మరోవైపు వీలైనంత త్వరగా బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్‌, భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలతో అప్రమత్తమైన హస్తం పార్టీ ఆ రెండు పార్టీల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వారందరినీ చేర్చుకోవాలన్న ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

లోక్​సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్​లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!

కాంగ్రెస్​లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్​కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా

Last Updated :Mar 29, 2024, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.