ETV Bharat / politics

జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం - నిమ్మకూరులో నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం - TDP Leaders Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 2:01 PM IST

TDP Leader Nandamuri Ramakrishna Election Campaign
TDP Leader Nandamuri Ramakrishna Election Campaign

TDP Leader Nandamuri Ramakrishna Election Campaign: నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందని తెలియజేశారు. వైఎస్సార్సీపీను ఇంటికి పంపించడం కోసం టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

TDP Leader Nandamuri Ramakrishna Election Campaign : కృష్ణా జిల్లా నిమ్మకూరులో నేటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన రామకృష్ణ, ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు.

సంక్షేమ పథకాలకు ఆధ్యుడు అన్న ఎన్టీఆర్ : అనంతరం గుడివాడలో రామకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభిచారు. రాష్ట్రంలో కూటమి పార్టీలను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉందని, రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీకి మద్దతుగా ప్రచారం ప్రారంభిస్తున్నానని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయం అయిపోయిందని అన్నారు. టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంటే, జగన్ పాలనలో అభివృద్ధి సూచికలో స్థానమే లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల ప్రగతి కోసం టీడీపీ పని చేసిందని గుర్తు చేశారు.

నిమ్మకూరులో నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం - జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం అంటూ ఆగ్రహం

హిందుపురంలో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన - Vasundhara Campaign in Hindupur

ఐటీ ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశం : అభివృద్ధి సంక్షేమం ఎవరి హయాంలో బాగుందో ఆలోచించి ఓటు వేయాలని నారా బ్రాహ్మణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పై-కేర్ ఐటీ ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశం అయ్యారు. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులతో కళకళలాడేదని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు వస్తే, వైఎస్సార్సీపీ హయాంలో వాటిని తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పుర్వవైభవం రావాలంటే కూటమి ప్రభుతాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంగళగిలోని పై-కేర్‌ ఐటీ సంస్థ ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశం

జోరుగా మంగళగిరిలో ఎన్నికల ప్రచారం-హోటల్ లో టిఫిన్​ చేసిన నారా బ్రాహ్మణి - Nara Brahmani Visit Small Hotel

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.