ETV Bharat / politics

కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లుగా అబద్ధాలతో రాజకీయాలు చేస్తోంది : కిషన్‌ రెడ్డి - TBJP Chief Kishan Reddy Press Meet

author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 2:28 PM IST

TBJP Chief Kishan Reddy Press Meet : అధికారం కోసం కేసీఆర్​, రేవంత్​ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి తెలిపారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

TBJP Chief Kishan Reddy Press Meet
TBJP Chief Kishan Reddy Press Meet (ETV Bharat)

Kishan Reddy Fires on CM Revanth : కేసీఆర్​ మాదిరిగానే రేవంత్​ రెడ్డి కూడా ప్రమాదకారి అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం కేసీఆర్​, రేవంత్​ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని అన్నారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందని దుయ్యబట్టారు. అబద్ధాలతో కాంగ్రెస్​ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సర్జికల్​ స్ట్రైక్స్​ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి కాంగ్రెస్​ నాయకులు దిగజారారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్​ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదన్నారు. భద్రతా బలగాలను కాంగ్రెస్​ నేతలు అవమానపరిచారని ఎద్దేవా చేశారు. పాక్​ వద్ద అణుబాంబులు ఉన్నందున అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్​ నేత చెబుతున్నారని, పాకిస్థాన్​కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్​కే ఉందని దుయ్యబట్టారు. పాక్​ దాడులను భారత్​ పూర్తిగా నిలువరించిందని చెప్పారు. పాక్​ తోకను పూర్తిగా కత్తిరించి నడ్డివిరిచామని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అసమర్థత వల్ల పాక్​కు అడ్డుకట్ట వేయలేకపోయారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు.

కేసీఆర్​ కంటే కేటీఆరే ఎక్కువగా అధికారం చెలాయించారు : బండి సంజయ్ - BANDI SANJAY COMMENTS ON KTR

బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుంది: కిషన్​రెడ్డి - kishan reddy on Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.