ETV Bharat / politics

బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు : జీవన్​రెడ్డి - JEEVAN REDDY CHAI PE CHARCHA

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 1:21 PM IST

Updated : Apr 29, 2024, 1:50 PM IST

Congress Candidate Election Campaign in Nizamabad
Jeevan Reddy Election Campaign

Jeevan Reddy Chai Pe Charcha Program in Nizamabad : బీజేపీ రుణమాఫీ చేయమంటే అదానీ, అంబానీలకు మాత్రమే చేస్తుందని నిజామాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదాతలకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఉచిత విద్యుత్​ ఇస్తుందని గుర్తు చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని కాంగ్రెస్​ పార్టీ 'చాయ్​ పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు జీవన్​రెడ్డి

Jeevan Reddy Chai pe Charcha Program in Nizamabad : ప్రచారంలో ఎవరెటు తిరిగినా ఎన్నికల ప్రక్రియ ముగియగానే గ్రామస్థులు అందరూ ఐక్యంగా ఉంటారని నిజామాబాద్ కాంగ్రెస్​ అభ్యర్థి ​తాటిపల్లి జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​ మండలం అంకపూర్​ గ్రామంలో కాంగ్రెస్​ పార్టీ 'చాయ్​ పే చర్చ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Jeevan Reddy on Rythu Runa Mafi in Telangana : నిజామాబాద్ జిల్లాలోని అంకపూర్ రాష్ట్రంలోనే ఆదర్శమని, వ్యవసాయ రంగంలోని మెళకువలు ఈ ప్రాంతంలో నేర్చుకోవచ్చని జీవన్​ రెడ్డి తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్​ ఇస్తుందని, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ కరెంట్​ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయని, దానికి అనుగుణంగానే రాయితీలు పెంచారని, కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ ఇవ్వడం సాధారణ విషయమే అని అన్నారు.

నన్ను ఎంపీగా గెలిపిస్తే జక్రాన్​పల్లికి పసుపు బోర్డు తీసుకొస్తా : జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Election Campaign

Jeevan Reddy Comments on BJP : రైతులకు రుణమాఫీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదేనని జీవన్​రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు రుణమాఫీ చేయమంటే అదాని, అంబానీలకు మాత్రమే చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

"ఎంపీ అరవింద్​ గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్​ పేపర్​ రాసి మాట తప్పారు. షుగర్​ పరిశ్రమను తెరిపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాంటిది అరవింద్​ ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఏమి చేశారు? 25 ఎకరాల్లో మామిడి మార్కెట్​ పెట్టిన ఘనత నాది. కావాలంటే ఎంపీ అరవింద్​ వచ్చి చూసుకోవాలి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటాను." - తాటిపత్రి జీవన్​ రెడ్డి, నిజామాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి


గడిచిన ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిజామాబాద్​లో అభివృద్ధి : జీవన్​రెడ్డి - Jeevan Reddy On CM visit

జగిత్యాల చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్​ - MP Arvind in Chai Pe Charcha

Last Updated :Apr 29, 2024, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.