గడిచిన ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిజామాబాద్​లో అభివృద్ధి : జీవన్​రెడ్డి - Jeevan Reddy On CM visit

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 5:00 PM IST

thumbnail

Jeevan Reddy On CM Nizamabad Tour : తన నామినేషన్​ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ పాత కలెక్టర్​ బంగ్లా మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్​లపై పలు విమర్శలు గుప్పించారు.

గడచిన ఐదేళ్లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని జీవన్​ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని గులాబీ పార్టీపై మండిపడ్డారు. నిజామాబాద్​లో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుందన్న జీవన్ రెడ్డి, తాను ఎంపీగా గెలిపొందాక జిల్లాలో అవసరమైన కార్యక్రమాలు చేపడతానని వివరించారు. సోమవారం నిజామాబాద్​కు సీఎం రేవంత్ రెడ్డి రానున్న వేళ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.