ETV Bharat / politics

"పంటలకు పరిహారం ఇవ్వకుంటే లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తాం" - Harish Rao Comments on CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 3:00 PM IST

Updated : Mar 27, 2024, 10:48 AM IST

Harish Rao Fires on CM Revanth Reddy
Harish Rao on Farmers Problems

Harish Rao on Farmers Problems : గత పదేళ్లుగా ఇబ్బంది పడని రైతులు నేడు సాగుకు నీరులేక అల్లాడిపోతున్నారని బీఆర్​ఎస్ మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయం పట్టడం లేదని మండిపడ్డారు. సాగుకు నీరులేక 20లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు.

Harish Rao on Farmers Problems : గత పది సంవత్సరాల్లో నీటి కొరతతో ఇబ్బందులు పడని రైతులు నేడు సాగుకు నీరులేక అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సాగు నీరు లేక, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలీక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ విషయం పట్టడం లేదని హరీశ్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల చేరికలపై తప్ప రైతుల గురించి ఆలోచన లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని, అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.

'సీఎం రేవంత్‌ రెడ్డి తిట్లతో పోటీపడుతున్నారు - నేరపూరిత వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం సుమోటోగా స్వీకరించాలి'

Harish Rao Fires on CM Revanth Reddy
Harish Rao on Farmers Problems

"రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. వంద రోజులైనా రేవంత్‌రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు. 4 నెలల్లో ఏం సాధించారని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు?. సీఎం ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు." - హరీశ్‌రావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

వడగళ్ల వానలు, ప్రభుత్వం నీటినిర్వహణ లోపం వల్ల కానీ, కరెంటు సరఫరా లోపాల వల్ల కానీ కారణాలు ఏవైనా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే రైతులకు ఎకరానికి రూ.25,000లు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు, సహాయక చర్యలకు ఎన్నికల కోడ్​ అడ్డురాదని తెలిపారు. రుణాల విషయాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్​ఎస్​తోనే సాధ్యం : హరీశ్​ రావు

'కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోపే రైతులకు కన్నీళ్లు తీసుకొచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను కనీసం పట్టించుకోవడం లేదు. రైతుల పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీ బాధ్యత వహించాలి. అక్రమ కేసులు, బెదిరింపులపై తప్ప కాంగ్రెస్, బీజేపీలకు వేరే ఆలోచన లేదు. చేరికలు కాదు రైతుల కన్నీటి చారికలపై దృష్టి పెట్టాలి. రాజకీయ ప్రయోజనాలు కాదు రైతుల ప్రయోజనాలు ముఖ్యం' అని హరీశ్​రావు అన్నారు.

Harish Rao Water Crisis in Telangana : అన్నదాతలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులు అప్పులు కట్టవద్దని, బీఆర్​ఎస్​ వారికి అండగా ఉంటుందన్నారు. రైతు రుణమాఫీ జరిగేదాకా పోరాడతామని తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా, కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అవసరమైతే లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

Last Updated :Mar 27, 2024, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.