ETV Bharat / politics

మంత్రివర్గ సమావేశానికి ఈసీ గ్రీన్​ సిగ్నల్​ - రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ - Telangana Cabinet Meeting

author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 2:52 PM IST

Updated : May 19, 2024, 7:12 PM IST

Telangana Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana Cabinet Meeting
Telangana Cabinet Meeting (ETV Bharat)

EC Gives Permission for Telangana Cabinet Meeting Today : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్​ భేటీ జరగనుంది. నిన్న జరగాల్సిన సమావేశం ఈసీ అనుమతి లభించక వాయిదా పడింది. నేడు ఈసీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధిస్తూ సమావేశానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

జూన్​ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. అలాగే ఏజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్​ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్​ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్​ స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్​ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.

శనివారం కేబినెట్​ భేటికి నో ఫర్మిషన్ : రైతు రుణమాఫీ, ఏపీ-తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు,ఖరీఫ్​ పంటల ప్రణాళిక, ఇంకా రైతులకు సంబంధించిన అనేక అంశాలు, పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభానికి సన్నాహకాలపైన శనివారం కేబినెట్​ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే మరోవైపు జూన్​ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై కూడా సీఎం చర్చించాలని చూశారు. అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్​, వరంగల్​-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమల్లో ఉండటంతో మంత్రిమండలి సమావేశ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది.

Telangana Cabinet Meeting Permission Today : ఈసీ నుంచి అనుమతి వస్తుందని భావించి శనివారం రాత్రి 7 గంటల వరకు సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయంలోనే వేచి చూశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్​ భేటీని వాయిదా వేశారు. సోమవారం వరకు ఈసీ స్పందించకపోతే దిల్లీకి వెళ్లి కలవాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేబినెట్​ సమావేశానికి షరుతులతో కూడిన అనుమతిని ఇస్తూ నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఎప్పుడనేది రేపటిలోగా తెలిసే అవకాశముంది.

నేడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం - వాటిపైనే ప్రధాన చర్చ - Telangana Cabinet Meeting May 18th

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై సీఎం రేవంత్​ ఫోకస్ - Telangana Cabinet Meeting May 18th

Last Updated : May 19, 2024, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.