ETV Bharat / politics

ఏపీ సీఎంవోకు చేరిన చిలకలూరిపేట రూ.6.5 కోట్ల పంచాయితీ - జగన్​కు ఆధారాలు అందజేత

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 7:45 PM IST

Mallela Rajesh met CM YS Jagan : ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి విడుదల రజిని, మల్లెల రాజేశ్ మధ్య రాజుకున్న వివాదం చివరికి సీఎంవోకు చేరింది. మంత్రి విడదల రజని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై సీఎం జగన్​కు ఫిర్యాదు చేసిన రాజేశ్,​ అందుకు సంబంధించి ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది.

Mallela Rajesh
Mallela Rajesh met CM YS Jagan

Mallela Rajesh met CM YS Jagan : ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎంవో నుంచి పిలుపు రావడంతో చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్​ నాయుడు సీఎం వైఎస్ జగన్​ను కలిశారు. చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినికి గుంటూరు వెస్ట్ టికెట్​ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నూతన ఇన్​ఛార్జిగా మల్లెల రాజేశ్​ నాయుడును నియమించి, ఆ తర్వాత కొద్దిరోజులకే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవలే చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును నియమించింది. ఈ క్రమంలో మల్లెల రాజేశ్​ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. పైగా తాను రూ.6.5 కోట్లు రజినీకి ఇచ్చానని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో సజ్జల జోక్యం చేసుకుని రూ.3 కోట్లు తిరిగి ఇప్పించారని తెలిపారు.

'సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు'

ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజినికి రూ.6 కోట్లు ఇచ్చినట్లు మల్లెల రాజేశ్​ బహిరంగంగా ఆరోపణలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు ఫిర్యాదు చేస్తే రూ.3 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజినిని కోరితే, దిక్కున్నచోట చెప్పుకోమన్నారని రాజేశ్​ ఆరోపించారు. మల్లెల రాజేశ్​ ఆరోపణలు సంచలనం రేకెత్తించడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. మల్లెల రాజేశ్​ను సీఎంవోకు పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడారు. అనంతరం సీఎంతో సమావేశమైన మల్లెల రాజేశ్​, మంత్రి విడదల రజిని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై జగన్​కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సీఎంకు ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది. పంచాయితీ దృష్ట్యా నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సైతం సీఎంవోకు చేరుకున్నారు.

విశాఖలో మరో కొండకు గుండు కొడుతున్న వైసీపీ నేతలు - భారీ యంత్రాలతో తవ్వకాలు

మంత్రి రజిని తనకు ఇంకా రూ.3 కోట్లు ఇవ్వాల్సి ఉందని కార్యకర్తల సమావేశంలో రాజేశ్​ వాపోయారు. సజ్జల జోక్యంతో కేవలం రూ.3 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజిని తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు స్పందిస్తూ సజ్జలను మార్చాలని, పార్టీని బతికించాలని నినాదాలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోబోమని అధిష్ఠానాన్ని హెచ్చరించిన రాజేశ్​,​ మర్రి రాజశేఖర్​కు టికెట్ ఇస్తే రూ.20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని అన్నారు. స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు సైతం డిమాండ్ చేశారు. కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే, దగ్గరుండి మరీ ఓడిస్తామని హెచ్చరించారు. మరి ఈ వివాదానికి సీఎం జగన్​ ఏ విధంగా చెక్​ పెడతారో వేచి చూడాలి.

అయిదేళ్లుగా ప్రజలకు నరకం చూపించి - ఎన్నికల ముందు ఎందుకీ హడావుడి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.