ETV Bharat / politics

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - AP Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 1:38 PM IST

Etv Bharat
Etv Bharat

Chandrababu Speech Praja Galam Public Meeting in Tadikonda : కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ వస్తుందని, జూన్‌ 4న విజయోత్సవాలు చేసుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రక్షణ, జగనాసుర వధ, రెండూ జరుగుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ముమ్మాటికీ అమరావతే

Chandrababu Speech Praja Galam Public Meeting in Tadikonda : 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్‌ (Chandrababu Fire on CM Jagan) లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాజధాని కోసం 29,000ల మంది అన్నదాతలు 35,000ల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించిందని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Chandrababu Fires on YSRCP : అమరావతిని కూడా హైదరాబాద్‌లా మార్చేెందుకు ప్రణాళికలు వేశామని చంద్రబాబు తెలిపారు. విజన్ ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కానీ అమరావతి కోసం పోరాడిన వారిపై 3,000లకు పైగా కేసులు బనాయించారని ఆరోపించారు. అమరావతి రైతులను జైళ్లలో పెట్టి రకరకాలుగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని, కర్నూలును అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అన్నారు.

ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట : విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించానని, సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేయాలనుకున్నానని గుర్తు చేశారు. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని నిప్పులు చెరిగారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని అన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

AP Elections 2024 : అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా అని, మన రాజధాని అమరావతేనని అన్నారు. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయని ఆ జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు, జగనాసుర వధ కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌ పోవాలి - ప్రజలు గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

నిరుద్యోగులను మోసం చేశారు : వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారని, సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు? చేశారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇవ్వలేదని, బడికి రంగులు వేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్ సభలకు జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారని, కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు.

శాండ్‌, ల్యాండ్‌, వైన్‌, మైన్‌ అన్ని రంగాలను జగన్ దోచేశారు - రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మా కలయిక : చంద్రబాబు

CBN Declared Amaravati is Permanent Capital in AP : రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ దిగిపోవాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందని, తాను సీఎంగా ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నానని గుర్తు చేశారు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, జూన్‌ 4న ఇక్కడ విజయోత్సవాలు చేసుకుందామని పేర్కొన్నారు. తాను, పవన్‌, మోదీ కలిసి (TDP, Janasena, BJP Alliance )అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.