ETV Bharat / politics

దిల్లీ మద్యం కేసులో కవిత బాధితురాలు మాత్రమే - నిందితురాలు కాదు : సత్యవతి రాఠోడ్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 5:27 PM IST

Satyavathi Rathod
Satyavathi Rathod on MLC Kavitha Arrest

Satyavathi Rathod on MLC Kavitha Arrest : రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు కాదని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్​తో కలిసి మోదీ కుట్ర పన్నారని పేర్కొన్నారు.

దిల్లీ మద్యం కేసులో కవిత బాధితురాలు మాత్రమే - నిందితురాలు కాదు : సత్యవతి రాఠోడ్

Satyavathi Rathod on MLC Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. కేసీఆర్, కేజ్రీవాల్​లను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే సాక్షిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారన్న ఆమె, కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో ఆమె మాట్లాడారు.

దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన భర్త అనిల్​, కేటీఆర్‌, హరీశ్‌రావు

లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే భారతీయ జనతా పార్టీ కవితను ఈడీ ద్వారా అరెస్ట్ చేయించిందన్నారు. ఈ క్రమంలోనే అప్రూవర్లుగా మారి ఏది చెప్పినా చెల్లుతుందా అన్న సత్యవతి రాఠోడ్, మోదీకి డబ్బులు ఇచ్చామని ఎవరైనా చెబితే ఆయనను కూడా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్​ఎస్​ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కవిత పోరాట యోధురాలని, కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​కు నిరసనగా బీఆర్​ఎస్​ శ్రేణుల ఆందోళన బాట - కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

కేసీఆర్, కేజ్రీవాల్​లను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే సాక్షిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమే. నిందితురాలు కాదు. కవిత పోరాట యోధురాలు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు. - ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్

ఇది ఈడీ కేసు కాదు - మోదీ కేసు : మరోవైపు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ప్రధాని మోదీ తమ పార్టీపై ఎలా నిందలు వేస్తారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. కేసీఆర్​ను లొంగదీసుకునేందుకు ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను మోదీ అరెస్టు చేయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలో నేరస్థులు చేరితే పరమ పవిత్రులు అవుతారా అని నిలదీశారు. కవిత రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అని రాజకీయ దురుద్దేశంతో ప్రస్తావించారని ఆక్షేపించిన సునీత, బీజేపీ దురుద్ధేశం లోకానికి తెలియడానికి ఈ ఒక్క అంశం చాలని వ్యాఖ్యానించారు. ఇది ఈడీ కేసు కాదని, మోదీ కేసు అని అన్నారు. మోదీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ - పలువురు నేతల రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.