ETV Bharat / politics

కాంగ్రెస్​లో శిందేలు లేకపోతే - రేవంత్​ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు : ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి - BJP Mla Maheshwar Reddy On Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 6:48 PM IST

Updated : Apr 11, 2024, 9:06 PM IST

BJP MLA Maheshwar Reddy On Congress govt
BJP MLA Maheshwar Reddy On Congress govt

BJP MLA Maheshwar Reddy On Congress govt: కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా సెటిల్​మెంట్​ చేసుకుంటుందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వర్​ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP MLA Maheshwar Reddy On Congress govt : గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రీ-సెటిల్​మెంట్ చేసుకుంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. నాలుగు నెలలు గడిచినా అవినీతి పరులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అంతర్గతంగా సెటిల్​మెంట్ చేసుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్​లో శిందేలు లేకపోతే మహబూబ్​నగర్​లో సీఎం రేవంత్​రెడ్డి ఎందుకు అభద్రతా భావంతో మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో (BJP Office) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP MLA Maheshwar Reddy Fires On Congress : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 15 ఎకరాల భూమి హెటిరో డ్రగ్స్ పార్థసారథికి గత ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. మార్కెట్​లో ఆ భూమి విలువ రూ.1500కోట్లు- రూ.2000కోట్ల వరకు ఉంటుందన్నారు. జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని(Land) ప్రస్తుత ప్రభుత్వం హెటిరో(Hetero Drugs) డ్రగ్స్ పార్థసారథికి మళ్లీ కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని మహేశ్వర్​ రెడ్డి హెచ్చరించారు. రూ.300 కోట్లను సీఎం రేవంత్​రెడ్డి దిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

'గత ప్రభుత్వాన్ని రూ.20 వేలు డిమాండ్​ చేసి - ఇప్పుడు మీరెందుకు ఇవ్వట్లేదు?' -

"దందాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం లేదు. రూ.2లక్షల కోట్ల ధరణి కుంభకోణంలో ఏమేరకు సెటిల్​మెంట్ చేసుకున్నారు? రేవంత్​ అంటే నా వంతు ఏంటి అంటున్నారంటా. కొంతమంది వ్యక్తులతో సూడో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో సెటిల్​మెంట్ బయటపెడతా. సీఎం రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లగానే వెంకట్​ రెడ్డికి భయం పట్టుకుంది"- ఏలేటి మహేశ్వర్​ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే

కాంగ్రెస్​లో శిందేలు లేకపోతే - రేవంత్​ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు : ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి

కాంగ్రెస్​లో శిందేలు లేరు- రేవంత్​ రెడ్డే పదేళ్లు సీఎం : కోమటిరెడ్డి
రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో ఏకనాథ్​ శిందేలు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. తామంతా కలిసికట్టుగా సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. బీజేపీ కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతుందని ధ్వజమెత్తారు. హరీశ్​రావు, మహేశ్వర్​ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు

'ధరణి' పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : ఏలేటి - Maheshwar Reddy on Dharani portalరాష్ట్రంలో మరో రెండు, మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి - maheshwar reddy warns on Land Grab

Last Updated :Apr 11, 2024, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.