ETV Bharat / opinion

పూర్తిస్థాయిలో లోక్‌సభ ఎన్నికల సమరంలోకి దూకిన ప్రధాన పార్టీలు - అత్యధిక సీట్లే లక్ష్యంగా ప్రచారాలు - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 12:35 PM IST

Telangana State Politics Discussion
Prathidwani on Lok Sabha Elections 2024

Prathidwani : లోక్​సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ మొదలయింది. మరోవైపు ప్రముఖ నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, తమ వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Prathidwani on Telangana State Politics : రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల సమరంలోకి పూర్తిస్థాయిలో దూకాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పార్టీలు తమ అభ్యర్థులకు బీఫాంలు అందిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయం నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గెలవడమే లక్ష్యంగా బలమైన అభర్థులను ఎంపిక చేస్తున్న పార్టీల అధినాయకత్వం, ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీలోకి స్థానికంగా నేతల చేరికలు పెరుగుతున్నాయి.

Lok Sabha Elections 2024 : గత ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌, ఈసారి టార్గెట్‌ 14 చేసుకుని ప్రచారం సాగిస్తోంది. బీజీపీకి నలుగురు సిట్టింగ్‌ ఎంపీలు అయితే, ఈసారి లక్ష్యం రెట్టింపు చేసుకుంది. బీఆర్ఎస్​కు చెందిన 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు పార్టీ మారారు. బహిరంగ సభలతో బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్‌ బలాన్ని చేకూరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలకు కలిసి వచ్చే అంశాలేంటి? సొంత పార్టీల్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న నేతలను పార్టీ నాయకత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది? ఇదే నేటి ప్రతిధ్వని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.