ETV Bharat / international

స్కూల్ హాస్టల్​లో మంటలు- 13 మంది మృతి- ఫ్యాక్టరీలో పేలుడుకు 8 మంది బలి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 9:56 AM IST

Updated : Jan 20, 2024, 2:33 PM IST

Fire Accident In Dormitory In China
Fire Accident In Dormitory In China

Fire Accident In Dormitory In China : చైనాలోని ఓ పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగి 13 మంది మృత్యువాత పడ్డారు. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు, ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది చనిపోయారు.

Fire Accident In Dormitory In China : చైనాలోని ఓ పాఠశాల వసతి గృహంలో మంటల చెలరేగి 13 మంది మృతిచెందగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన హెనాన్​ ప్రావిన్స్​లో యన్​షాన్​పు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.

చైనా వార్తా సంస్థల కథనాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు వెంటనే రంగంలోకి దిగాయని, 11.38 గంటల సమయానికి మంటలను పూర్తిగా ఆర్పేశాయని చైనా మీడియా వెల్లడించింది. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేసింది. మూడో తరగతి విద్యార్థులేనని స్థానిక వార్తా సంస్థతో ఆ స్కూల్ టీచర్ తెలిపారు.

కిండర్​గార్డెన్ పిల్లలే!
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్కూల్ గురించిన వివరాలేవీ అధికారంకంగా బయటకు రాలేదు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కిండర్​గార్డెన్ స్థాయి పిల్లలు ముఖాలకు మాస్క్ ధరించడం కనిపిస్తోంది. క్యాలీగ్రఫీ నేర్చుకునే విద్యార్థులు సైతం ఇక్కడ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చైనాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఫ్యాక్టరీలో పేలుడు
శనివారం తెల్లవారుజామున జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. జియాంగ్సూ రాష్ట్రంలోని చాన్​గ్జౌ సిటీలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

చైనాలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. సేఫ్టీ నిబంధనలు సరిగా లేకపోవడం, ఉన్న నిబంధనలను అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల అగ్నిప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది నవంబర్​లో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది చనిపోయారు. షాన్షీ ప్రావిన్స్​లోని ఓ బొగ్గు గని కంపెనీ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. జూన్​లో ఓ బార్బెక్యూ రెస్టారెంట్​లో పేలుడు సంభవించగా 31 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కార్యాలయాల్లో సేఫ్టీ నిబంధనలు పాటించేలా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. 21 మంది మృతి

కిమ్‌ కవ్వింపు- సముద్రగర్భ 'అణు' డ్రోన్‌ పరీక్ష- అమెరికా, జపాన్​కు వార్నింగ్!

Last Updated :Jan 20, 2024, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.