ETV Bharat / bharat

'ఆకలేస్తోంది దోశ తినేసి వస్తా'- సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్​- రెండు గంటల తర్వాత వచ్చి ఆపరేషన్​! - Doctor left The Surgery For Eating

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 10:51 AM IST

Doctor left The Surgery For Eating
Doctor left The Surgery For Eating

Doctor left The Surgery For Eating : సర్జరీ చేయడానికి వెళ్లిన ఓ డాక్టర్ ఆకలి వేసిందని మధ్యలోనే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చేశాడు. మసాలా దోశ తిని దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి సర్జరీని పూర్తి చేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీలో జరిగింది.

Doctor left Surgery For Eating : ఆకలి వేసిందని సర్జరీని మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్​ నుంచి బయటకు వచ్చేశాడు ఓ డాక్టర్. ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి ఆపరేషన్​ పూర్తి చేశాడు. సర్జరీ తర్వాత కూడా పూర్తిగా నయం కాకపోవడం వల్ల డాక్టర్ కలిసేందుకు వెళ్లినా నిరాకరించాడు. దీంతో వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీలో జరిగింది.

ఇదీ జరిగింది
జిల్లాలోని నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక ఓ రోజు ఇంట్లో ఆకస్మాత్తుగా కింద పడిపోయింది. దీంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ ఆర్థోపెడిక్​ సర్జన్ ఆ బాలిక చేతికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. గతేడాది డిసెంబర్ 22న సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్​కు తీసుకెళ్లారు. అయితే, ఆపరేషన్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వచ్చి పూర్తి చేస్తానని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. దాదాపు 2గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్​ను పూర్తి చేశాడు. కానీ ఆపరేషన్​ తర్వాత చేతికి నయం కాలేదని, అలాగే వేళ్లు కూడా వంకరగా మారాయని బాలిక మళ్లీ ఆ డాక్టర్​ను కలిసేందుకు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెను కలిసేందుకు డాక్టర్ నిరాకరించాడు. దీంతో ఆ బాలిక మరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

ఆపరేషన్ చేసే సమయంలో తాను అన్నింటిని చూశానని, వినగలిగానని బాలిక అంటుంది. ' చేయి మాత్రమే మొద్దుబారిపోయింది. ఆపరేషన్​ ఎలా చేస్తున్నారో నేను చూడగలిగాను. మధ్యలో నాకు ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వస్తానని చెప్పి డాక్టర్​ వెళ్లాడు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా ఆపరేషన్​ పూర్తి చేశాడు. ఈ సర్జరీ తర్వాత గ్యారంటీగా చేయి నయం అవుతుందని డాక్టర్ చెప్పాడు. కానీ, నయం కాలేదు. అదే కాకుండా చేతి వేళ్లు కూడా వంకరగా మారాయి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే కలిసేందుకు నిరాకరించారు. ఇంకా వేరే ఆస్పత్రిలో వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నా​' అని కాజల్ శర్మ తెలిపింది.

పట్టించుకోని అధికారులు
ఈ విషయంపై నవాబద్ పోలీస్ స్టేషన్​లో డాక్టర్​పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక అంటుంది. ఆ తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని సీఎం ఆఫీస్​కు వెళ్లింది కాజల్. అక్కడ కూడా సిబ్బంది బిజీగా ఉన్నారని చెప్పారు. దీంతో నేరుగా సీఎంని కలిసి పిర్యాదు చేస్తామని బాలిక తెలిపింది.

ఎవరెస్ట్ బేస్ ​క్యాంప్​కు ఆరేళ్ల బాలుడు- దుబాయ్​ నుంచి జర్నీ ఇలా! - Mount Everest Base Camp Trekking

పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం- ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి- బాణసంచానే కారణం! - Fire Accident In Wedding Ceremony

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.