ETV Bharat / bharat

MSPకి చట్టబద్ధత, శాశ్వత రుణమాఫీ కమిషన్- కాంగ్రెస్‌ 'కిసాన్‌ న్యాయ్‌' 5 గ్యారంటీలు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 7:19 PM IST

Updated : Mar 14, 2024, 8:13 PM IST

Congress Kisan Nyay Guarantee : 2024 లోక్​సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో వస్తే పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్​. ఈ నేపథ్యంలో కిసాన్​ న్యాయ్​ పేరిట ఐదు హామీలను ప్రకటించింది.

Congress Kisan Nyay Guarantee
Congress Kisan Nyay Guarantee

Congress Kisan Nyay Guarantee : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైతులపై కాంగ్రెస్‌ పార్టీ హామీల వర్షం కురిపించింది. కిసాన్‌ న్యాయ్‌ పేరిట 5 గ్యారంటీలను ప్రకటించింది. దేశంలో పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్​టీ ఎత్తివేస్తామని వెల్లడించింది. రైతుల పంట బీమా సొమ్ము 30 రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఐదు కిసాన్ గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఐదు హామీలేంటంటే?

  • పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
  • వ్యవసాయ పరికరాలపై జీఎస్​టీ ఎత్తివేత
  • రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్‌
  • పంట బీమా సొమ్ము 30 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ
  • రైతుల కోసం కొత్త ఎగుమతి, దిగుమతి విధానం

అంతకుముందు బుధవారం మహిళలపై కాంగ్రెస్ పార్టీ హామీల జల్లు కురిపించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో 'నారీ న్యాయ్​' పేరిట మహిళలకు ఐదు గ్యారెంటీలను ప్రకటించింది హస్తం పార్టీ. అవేంటంటే?

మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ

ఆదీ ఆబాదీ- పూరా హక్‌: కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌

శక్తి కా సమ్మాన్‌: ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు

అధికార్‌ మైత్రీ : న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్‌ మైత్రీ నియామకం

సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్లు రెట్టింపు- ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్‌ ఏర్పాటు

Last Updated : Mar 14, 2024, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.