ETV Bharat / bharat

ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి- ప్రేమ విఫలం అయినందుకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 12:33 PM IST

Updated : Mar 4, 2024, 1:19 PM IST

Acid Attack On College Students
Acid Attack On College Students

Acid Attack On College Students : పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు కాలేజీ విద్యార్థులపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Acid Attack On College Students : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ చేశాడు ఓ యువకుడు. తీవ్రంగా గాయపడిన బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్నాటకలోని కడబ ప్రభుత్వ కళాశాలలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఆ ముగ్గురు విద్యార్థులు ద్వితీయ పీయూసీ( ఇంటర్) చదువుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో పీయూసీ పరీక్షలు జరుగుతున్నాయి. కడబ ప్రభుత్వ కళాశాలలో పరీక్షను రాసేందుకు విద్యార్థలు వచ్చారు. కళాశాల ఆవరణలో కూర్చొని విద్యార్థినులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఎంబీఏ చదువుతున్న అబిన్(23) విద్యార్థిలాగా మాస్క్, టోపీ ధరించి కాలేజీ వచ్చాడు. పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థినిపై ఒక్కసారిగా యాసిడ్​తో దాడి చేశాడు. దీంతో ఆ అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పక్కనే కూర్చున మరో ఇద్దరి మీద కూడా యాసిడ్​ పడి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే కడబ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

కారణం అదే!
ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దాడి అనంతరం తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ప్రేమ విఫలమవడం కారణంగానే నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
ఓ వ్యక్తి తన ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఇటీవలే ఝార్ఖండ్​లో జరిగింది. దుమ్కా ప్రాంతంలోని సునిరామ్ కిస్కు అనే వ్యక్తి గత కొంత కాలంగా ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ప్రియురాలిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్న బాధితురాలు, ఆమె తల్లిపై పెట్రోల్​ పోసి నిప్పంటించి పారిపోయాడు. వీరిని గమనించిన స్థానికులు, బాధితురాలు, ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు!

కస్టమ్స్​ ఆఫీసర్​ పేరుతో 250మంది మహిళలకు గాలం- పెళ్లి పేరుతో మోసం- చివరకు చిక్కాడిలా!

Last Updated :Mar 4, 2024, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.