తెలంగాణ

telangana

బెల్టులతో కొడుతూ చిత్రహింసలు.. మూకదాడిలో యువకుడు మృతి

By

Published : May 8, 2022, 10:56 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

()
Youth murdered in Delhi: దిల్లీలో దారుణం జరిగింది. దాబ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల ఓ యువకుడిని అల్లరి మూకలు కొట్టి చంపాయి. ఏప్రిల్ 23న ఈ ఘటన జరగ్గా.. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 23న ఆ యువకుడిని కొందరు యువకులు ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లారు. రోడ్డు పక్కన పడేసి తీవ్రంగా కొట్టారు. విచక్షణారహితంగా బెల్టులతో కొడుతూ వీడియోలు తీశారు. అనంతరం, ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Last Updated :Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details