తెలంగాణ

telangana

Mana ooru Mana Badi program : భలే మంచి మాస్టార్.. 'బడిబాట'ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..!

By

Published : Jun 18, 2023, 6:00 PM IST

Mana ooru Mana Badi program

Raiparti School teachers promoting on badi bata program : ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలని ఉపాధ్యాయులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా రావుల భాస్కర్​రావు అనే ఉపాధ్యాయుడు బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని హ్యాండ్​మైక్​తో ఇదిగో ఇలా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ''మన ఊరు మన బడి'' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు గురించి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అధునాతన తరగతి గదులు, నీటి సౌకర్యం, శౌచాలయాలు, నాణ్యమైన భోజనం వంటి అనేక వసతులు ప్రభుత్వం అందిస్తుందని భాస్కర్ తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని హంగులతో నేడు ప్రభుత్వ పాఠశాలలు అవతరించాయని మైక్​ ద్వారా ప్రచారం చేశారు. తల్లిదండ్రులు డబ్బులు కట్టి ప్రైవేట్​ పాఠశాలలకు పిల్లలను పంపించే బదులు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాల గురించి ఇలా ప్రచారం చేయడంపై భాస్కర్​రావును జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details