తెలంగాణ

telangana

Bharat Jodo Yatra పాదయాత్రలో రాహుల్ పరుగు పోటీ

By

Published : Oct 30, 2022, 10:05 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

Bharat Jodo Yatra మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్‌ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ కొద్దిసేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో కలిసి పరుగుపందెంలో పాల్గొన్నారు. ఈ పరుగుపందెంలో రాహుల్​ మిగతావారికంటే ఒక అడుగు ముందుకేశారు. కొద్దిసేపు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. పాదయాత్రలో భారీగా అభిమానులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో రాహుల్ వెంట ఉన్న పార్టీ ముఖ్యనేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details