తెలంగాణ

telangana

ఈ నెల 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - 23న ఉత్తరద్వార దర్శనం

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 10:27 PM IST

Bhadrachalam Vaikunta Ekadasi 2023

Bhadrachalam Vaikunta Ekadasi 2023 :ఇవాళ భద్రాద్రి రామయ్య సన్నిధిలోని లక్ష్మణ సమేత సీతారాముల నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈనెల 13 నుంచి జరగనున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు రంగులు, చలువ పందిల్లు, విద్యుత్ దీపాలు అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల నుంచి చలి గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న కారణంగా భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. ఈ కారణంగా ఆలయ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

శ్రీ వైకుంఠ ఏకాదశి 2023 : ప్రతిరోజు బేడ మండపం వద్ద నిర్వహించే నిత్య కల్యాణం వేడుక వర్షం కారణంగా ప్రాకార మండపంలో నిర్వహించారు. ఈ నెల 22న సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక నిర్వహించనున్నారు. 23న శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వేడుకలు జరుపనున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అలంకరించడం వంటి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details