తెలంగాణ

telangana

Warangal Flood 2023 : అతలాకుతలమైన జంపన్న వాగు పరిసర ప్రాంతం.. సాయం కోసం బాధితుల ఎదురుచూపులు

By

Published : Jul 30, 2023, 3:33 PM IST

Updated : Jul 30, 2023, 7:55 PM IST

Telangna Heavy Rains Problems : మేడారం వెళ్లే భక్తులందరికీ జంపన్నవాగు అంటే భక్తి. ఇక్కడ పుణ్యస్నానాలు చేసి వనదేవతలు దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఇప్పుడు ఆ జంపన్న వాగే.. అడవి బిడ్డలపై సునామిలా విరుచుకుపడింది. పచ్చని ఊళ్లను ఏరులా మార్చేసింది. ఈ గ్రామాలపై జల ఖడ్గంలా దూసుకొచ్చిన వరదలకు.. 8మంది ప్రాణాలు కోల్పోయ్యారు. వందలాది మంది సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో.. ములుగు జిల్లాలోని సొంత ఊళ్లకు చేరుకుంటున్న ప్రజలు ఆనాటి జలవిలయాన్ని తలుచుకుని వణికిపోతున్నారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోకుంటే ఊళ్లలో ఉండలేమని చెబుతున్నారు.

Warangal Flood 2023
Warangal Flood 2023

అతలాకుతలమైన జంపన్న వాగు పరిసర ప్రాంతం

Heavy Rains in Warangal 2023 : ఈ నెల 26 బుధవారం సాయంత్రం.. వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండలా మారుతున్నాయి. ఎప్పటిలానే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినా.. ఆ తర్వాత అంతా సర్ధుకుంటుందని భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లక్నవరం సరస్సు, గుండ్లవాగు ప్రాజెక్టు, కాల్వపల్లి సమీపంలో ఉన్న వాగు, అడవుల్లో ఉన్న వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించి.. జంపన్నవాగులోకి వరద పోటెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ పరుగులు తీశారు.

Warangal Peoples Problems Effected Heavy Rain: వరద ఊరిని ముంచుతుందన్న భయంతో 60 మంది గ్రామపంచాయతీ భవనాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి కొంతమంది వరదలో ఉన్న చెట్లని ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే 13మంది.. కొండాయి నుంచి మల్యాల వెళ్తుండగా మార్గం మధ్యలో దాటుతుండగా నీటిలో మునిగిపోయారు. ఇందులో ఐదుగురు విద్యుత్‌ తీగలను పట్టుకొని ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన 8మంది మృతి చెందారు. సాధారణ సమయంలో ఏమాత్రం నీరులేని చిన్నపాటి కాల్వ ప్రాణాలు తీయడం గ్రామవాసుల్ని తీరని విషాదంలో నింపింది. తెల్లవారి లేచింది కళ్లముదు తిరిగే వారు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

తాగేందుకు నీరు కూడా దొరకలేదు : నాలుగు రోజులుగా వరదల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన వారికి తాగేందుకు నీరు, తినేందుకు తిండి దొరకక కష్టమైందని బాధితులు తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సాయం అందే వరకు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపామని గుర్తుచేసుకుంటున్నారు. ముంచెత్తిన వరద నుంచి దొరికిన చోటల్లా తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. ఆనాటి విపత్తు కళ్లలో మెదులుతుండగానే కొండాయి, దొడ్ల, మాల్యాల గ్రామాల ప్రజలు ఊళ్లకు చేరుకుంటున్నారు. దొడ్ల, మల్యాల గ్రామాల మధ్య ఉన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. గతేడాది వర్షాలకే ఈ వంతెన కుంగిపోయి ప్రమాదం పొంచి ఉండగా.. ఈసారి పూర్తిగా కొట్టుకుపోయింది.

Warangal Floods 2023 : ఏ ఇంట చూసినా 'వరద' విషాదమే.. ఇంకా జల దిగ్బంధంలోనే ఓరు'ఘొల్లు'వాసులు

ఇప్పుడు మేము ఎలా బతకాలి : కొండాయి గ్రామం పూర్తిగా ఊరు మునగడంతో ఇళ్లన్నీ గోడలు కూలి కొన్ని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వరదతో మునిగిన ఇళ్లలోని వస్తువులన్నీ మట్టి పట్టడంతో శుభ్రం చేసుకుంటున్నారు. బియ్యం, నిత్యావసరాలు ఇంట్లోని సామగ్రి అంతా తడిసిపోయాయని.. ఇప్పుడు ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు శాశ్వత చర్యలు చేపడితేనే ఈ ఊళ్లో ఉండగలమని చెబుతున్నారు.గ్రామాల్లో పర్యటించిన మంత్రిసత్యవతి రాథోడ్‌ ఎదుట కూడా గ్రామస్థులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

"ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో మేమే ఏది అయితే ఎత్తుగా ఉంటదో దాని దగ్గరకి వెళ్లాం. చాాలా సమయం సాయం కోసం ఎదురు చూశాం. సహాయక చర్యలు వస్తాయని అలానే వేచి చూశాం. మాకు తెలిసి 8 మంది చనిపోయారు. పశువుల ఎన్ని మృతి చెందాయో ఇంకా లెక్క తెలియలేదు." - బాధితుడు

ఇవీ చదవండి :

Last Updated :Jul 30, 2023, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details