తెలంగాణ

telangana

కాస్త ఆలస్యమైనా.. డబుల్​ బెడ్​ రూం ఇళ్లు కట్టిస్తాం: ఎర్రబెల్లి

By

Published : Jan 13, 2021, 2:14 PM IST

కాస్త ఆలస్యమైనా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి.. పేదలకు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్​ బెడ్​రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు.

errabelli dayakar rao
కాస్త ఆలస్యమైనా.. డబుల్​ బెడ్​ రూం ఇళ్లు కట్టిస్తాం: ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో ఆయన పర్యటించారు. పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్నారు. కాస్త ఆలస్యమైనా ప్రతీ నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించడమే తమ ప్రభుత్య లక్ష్యమని తెలిపారు.

ఇవీచూడండి:కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు

ABOUT THE AUTHOR

...view details