తెలంగాణ

telangana

పరిగి ఎన్​ఆర్​ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు

By

Published : Mar 31, 2021, 5:07 PM IST

ఓ కాంట్రాక్టర్​ నుంచి రూ. రెండు లక్షలు డిమాండ్ చేసిన పరిగి ఎంపీడీఓ సుభాశ్​గౌడ్ అనిశా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు పరిగి ఎన్​ఆర్​ఈజీఎస్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.

Acb raids on nregs
న్​ఆర్​ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు

వికారాబాద్ జిల్లా పరిగి ఎన్​ఆర్​ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు నిర్వహించింది. కాంట్రాక్టర్ చక్రవర్తి నుంచి ఎంపీడీఓ సుభాశ్​గౌడ్.. రూ. రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఈసీ రఫీ, టెక్నికల్ అసిస్టెంట్లు రూ. రెండు లక్షలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details