తెలంగాణ

telangana

ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించింది: కొల్లు వెంకటేశ్వర్లు

By

Published : Mar 13, 2021, 3:33 PM IST

తెరాస నేతలు సమయం ముగిసినా ప్రచారం చేశారని తెదేపా సీనియర్ నేత కొల్లు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎన్నికల నియమామళిని ఉల్లంఘించారని విమర్శిస్తూ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయని అన్నారు.

tdp-senior-leader-kollu-venkateswarlu-fires-on-trs-on-mlc-election-campaign
ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించింది: కొల్లు వెంకటేశ్వర్లు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలను శుక్రవారం సాయంత్రం వరకే ముగించాల్సి ఉండగా... ఎన్నికల నియమావళిని తెరాస నేతలు ఉల్లంఘించారని తెదేపా సీనియర్ నాయకుడు కొల్లు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారంలో ఎంపీపీ చండూరు వెంకటేశ్వర్లు సమయం ముగిసినా శనివారం ప్రచారం చేశారని విమర్శించారు.

ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయని అన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై కలెక్టర్​కి ఆయన ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:బడ్జెట్​ సమావేశాలపై భాజపా ఎమ్మెల్యేలకు బండి దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details