తెలంగాణ

telangana

కేసీఆర్‌ దిల్లీకి వస్తాడనే భయంతోనే విషం చిమ్ముతున్నారు: జగదీశ్​ రెడ్డి

By

Published : May 15, 2022, 3:54 PM IST

కేసీఆర్‌ దిల్లీకి వస్తాడనే భయంతోనే విషం చిమ్ముతున్నారు: జగదీశ్​ రెడ్డి

Minister Jagadeesh Reddy on BJP: కేసీఆర్ ఎక్కడ దిల్లీ వరకు వస్తాడోననే భయంతోనే.. భాజపా నేతలు రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. దేశమంతా చీకట్లో ఉంటే రాష్ట్రం విద్యుత్‌ వెలుగుల్లో వెలగడాన్ని ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. అడుగడుగునా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పర్యటనలకు వస్తూ కుట్రలకు ప్రణాళికలు రచించుకుని వెళ్తున్నారని జగదీశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

Minister Jagadeesh Reddy on BJP: కేంద్ర మంత్రి అమిత్ షా ఒక అబద్ధాల షా అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఎక్కడ దిల్లీ వరకు వస్తాడోననే భయంతోనే.. భాజపా నేతలు రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణకు రుణాలు రాకుండా ఏ రకంగా ఎఫ్ఆర్​బీఎం పరిధిని నిర్ణయిస్తున్నారని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగంపై మంత్రి జగదీశ్​ రెడ్డి సూర్యాపేటలో స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురు చూస్తారని, ఏదో ఒక అభివృద్ధి పనులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశపడతారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రులు ఎందుకు తెలంగాణకు అభివృద్ధి పనులు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం 80 లక్షల కోట్ల అప్పు చేసిందని గుర్తు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి.. ప్రపంచంలోని ఏ సంస్థ అయినా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఏ ఒక్క సంస్థ కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. తమకు దక్కని గుర్తింపు కేసీఆర్​కు దక్కుతుందన్న కుట్రతో కేంద్రంలోని భాజపా మంత్రులు తెలంగాణకు రుణాలు ఇవ్వకుండా ఆయా సంస్థలను బెదిరిస్తున్నాయని ఆరోపించారు. దేశానికి మీరు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.

భాజపా అధికారానికి ముందు ఉన్న ధరలను ఇప్పుడు రెట్టింపు చేసిందని విమర్శించారు. చీకట్లో మగ్గుతున్న యూపీ, గుజరాత్‌లో అభివృద్ధి జరిగిందా అంటూ ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ అభివృద్ధి అని చెప్పుకుంటున్న భాజపా పాలిత రాష్ట్రాలు ఎందుకు తెలంగాణ కంటే వెనుకబడుతున్నాయని నిలదీశారు. ఇప్పటికైనా అబద్దాలు ఆడడం మానేసి తెలంగాణను చూసి నేర్చుకోవాలన్నారు. కేసీఆర్​పై విషం చిమ్ముతూ తెలంగాణ ప్రజలపైన కక్ష పూరితంగా వ్యవహరిస్తామంటే రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏమి చేయాలో బాగా తెలుసన్నారు.

"తెలంగాణలో అభివృద్ధి జరగలేదా?. అమిత్​ షా ఒక్కసారి ఏ గ్రామంలోకి వచ్చి అయినా చూడండి.. అభివృద్ధి అంటే ఏందో తెలుస్తది. చీకట్లో మగ్గుతున్న యూపీ, గుజరాత్‌లో అభివృద్ధి జరిగిందా?. కేసీఆర్ ఎక్కడ దిల్లీ వరకు వస్తాడోననే భయంతోనే.. భాజపా నేతలు రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు. కేసీఆర్​ భయంతో భాజపా, కాంగ్రెస్​ ఒక్కటయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణను కూడా చీకటి చేయాలనే కదా మీ కుట్ర." -జగదీశ్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

కేసీఆర్‌ దిల్లీకి వస్తాడనే భయంతోనే విషం చిమ్ముతున్నారు: జగదీశ్​ రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details