తెలంగాణ

telangana

Revanth Reddy: 'లక్షమందితో దండుకట్టి... కేసీఆర్​పై దండయాత్ర చేస్తాం'

By

Published : Sep 14, 2021, 8:49 AM IST

Revanth Reddy
దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా

గజ్వేల్​లో జరిగే సభలో లక్షకు తక్కువ కాకుండా జనంతో దండుకట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దండయాత్ర చేస్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్​లో చీలికలు తెచ్చి.. కేసీఆర్ కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

గజ్వేల్​లో 17న జరగనున్న దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా(DALITHA GIRIJANA ATMA GAURAVA DANDORA) సభలో దండుకట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దండయాత్ర చేస్తామని... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్ బలవంతుడేమీ కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్‌ వెల్లడించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని... ఇంతవరకు తట్ట మట్టి కూడా తీయలేదన్నారు.

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని గజ్వేల్‌ సభలో తీర్మానం చేస్తామన్నారు. సభకు లక్షకు తక్కువ కాకుండా జనంతో దండుకడతామని వెల్లడించారు. ప్రతి పోలింగ్​ బూతు నుంచి తొమ్మిదిమందిని... కార్యకర్తలు సభకు వచ్చేట్లు చేస్తే.. దాదాపు మూడున్నర లక్షల మంది సభకు రాగలరని రేవంత్ సూచించారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్(CONGRESS PARTY) నేతలు హాజరుకావాలని కోరారు.

ముఖ్యమంత్రి కుట్రలు చేసి... కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చీలికలు తెచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ.. కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. అదే సభలో నిర్వాసితుల ఫోటో ఎగ్జిబిషన్ పెడతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:REVANTH REDDY: గజ్వేల్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ'ను సక్సెస్ చేయాలి

ABOUT THE AUTHOR

...view details