తెలంగాణ

telangana

కేంద్రం తీరుతోనే అన్నదాతల మృతి: హరీశ్

By

Published : Dec 4, 2020, 8:12 AM IST

Updated : Dec 4, 2020, 8:33 AM IST

రైతుల నిరసనను కేంద్రం నిరంకుశంగా అణచివేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేంద్రం తీరుతోనే ఐదుగురు అన్నదాతలు మృతి చెందారని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్​కు అనుకూలంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

minister harish on farmers protest in delhi
కేంద్రం తీరుతోనే అన్నదాతల మృతి: హరీశ్

కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే నిరసన తెలపడానికి దిల్లీ వెళ్లిన రైతుల్లో ఐదుగురు మృతి చెందారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జల ఫిరంగుల ధాటికి ముగ్గురు, చలి తీవ్రత తట్టుకోలేక ఇద్దరు చనిపోయారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల సర్వసభ్య సమావేశంలో అతిథిగా మంత్రి పాల్గొన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మండల పరిషత్ చేసిన తీర్మానాన్ని ఆయన స్వాగతించారు.

కేంద్రం తీరుతోనే అన్నదాతల మృతి: హరీశ్

ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి కార్పొరేట్​కు అనుకూలంగా వ్యవహారిస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు దిల్లీకి కదిలివచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలిపితే... కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత పూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని రైతులు స్పష్టం చేసినా.. కేంద్రం వద్ద సమాధానమే లేదన్నారు. తెరాస ప్రభుత్వం ఉచితంగా కరెంటు సరఫరా చేస్తూ.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామంటే.. కేంద్రం ప్రత్యేక జీవో తెచ్చి రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:స్వస్తిక్​ గుర్తు లేకున్నా ఓటే... ఈసీ ఉత్తర్వులు

Last Updated : Dec 4, 2020, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details