తెలంగాణ

telangana

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

By

Published : Jul 6, 2019, 10:24 AM IST

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల పురోగమించేలా చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్​రావుతో కలిసి పాల్గొన్నారు.

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. నియామకాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ భాగాల ఉద్యోగులు సమన్వయంతో ముందుగు సాగి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీసేవల మెరుగు, 108 వాహనాల వినియోగం సక్రమంగా జరిగేలా చూడాలని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details