తెలంగాణ

telangana

'ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని.. మోదీ ప్రభుత్వం కోరుకుంటుంది'

By

Published : Mar 26, 2023, 7:50 PM IST

Updated : Mar 26, 2023, 9:58 PM IST

Chada Venkat Reddy Comments on Narendra Modi: ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కోరుకుంటుందని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు.

chada venkat reddy
chada venkat reddy

Chada Venkat Reddy Comments on Narendra Modi: దేశానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత .. ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ నడిపిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని చెప్పారు. కేంద్రం ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో.. దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత కాలం రాజకీయాల్లోకి ఆర్థిక నేర చరిత్ర కలిగిన వారు.. రాజకీయ భక్షకులు వస్తున్నారన్నారని చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా మోదీ అయిన తర్వాత ఎక్కువగా కుంభకోణాలు పెరిగిపోయానని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి.. కార్పోరేటర్లకు పట్టం కట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శిచారు. ప్రపంచ కుబేరుడిగా పేరుపొందిన గౌతమ్​ అదానీ.. నరేంద్ర మోదీ వల్లే రూ. 13లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. హిడెన్​బర్గ్​ నివేదికతో ఒక్కసారిగా అదానీ చేసిన భారీ ఆర్థిక మోసం బయటపడిందని.. ఇంత జరిగిన ఈ విషయంపై కేంద్రం ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.

ఈ చర్య ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: దీనిపై విపక్షాలు జేపీసీ వేయమంటే కేంద్రం ఏ మాత్రం స్పందించడం లేదని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇదే విషయంపై రాహుల్​ గాంధీ ప్రశ్నిస్తే అతనిని పార్లమెంటుకు రాకుండా రెండు సంవత్సరాలు అనర్హత వేటు వేశారని విమర్శించారు. సూరత్​ కోర్టు తీర్పు వెలువడి.. 24 గంటలు గడవక ముందే అనర్హత వేటు వేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 14 నుంచి మే 15వ తేదీ వరకు సేవ్​ డెమోక్రసీ.. సేవ్​ కానిస్టిట్యూషన్​ పేరిత కార్యక్రమం చేపడతామని వివరించారు.

"ప్రతిపక్షాలు ఒకే వేదిక మీదకు వచ్చి బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలి. రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటుంది. యువతకు మానసిక ధైర్యం ఇచ్చేందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ కేసును వెంటనే తేల్చాలి." - చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని.. మోదీ ప్రభుత్వం కోరుకుంటుంది

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2023, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details