తెలంగాణ

telangana

డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన సంగారెడ్డి కలెక్టర్

By

Published : Dec 24, 2020, 7:20 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని డబుల్​ బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. మండలంలోని అర్హులైన 45 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించారు.

sangareddy collecter started double bedrooms
డబుల్​ బెడ్​రూంలను ప్రారంభించిన సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​తో కలసి ప్రారంభించారు. మండలంలోని 45 డబుల్​ బెడ్​రూంలను లబ్ధిదారులకు అందజేశారు.

మండలంలో త్వరలో మరొక 5 ఇళ్లు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. డబుల్​ బెడ్​రూంలు అందుబాటులోకి రావడంతో.. తమ సొంతంటి కల నెరవేరందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details