తెలంగాణ

telangana

Theft in House: ఫ్రిడ్జ్​లో పాలు తాగి.. ఇంటిని గుల్ల చేసి..

By

Published : Jan 8, 2022, 4:07 PM IST

Theft in House:మనవడి పుట్టినరోజుకని వెళ్తే ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లోని బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘరానా చోరీ హైదరాబాద్​లోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో జరిగింది.

Theft in House
ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో భారీ చోరీ

Theft in House: నగరంలో దోపీడి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి బంగారు, వెండి, నగదును అపహరించారు. మనవడి పుట్టినరోజుకని వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దుండగులు. ఉదయాన్నే తిరిగొచ్చిన కుటుంబసభ్యులకు ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా చోరీ హైదరాబాద్​లోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో జరిగింది.

theft in yellammabanda: నగరంలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో నివసించే పద్మ ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మనవడి పుట్టిన రోజుకని శుక్రవారం మెహదీపట్నంలో ఉండే పెద్దకూతురు ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో పెళ్లి కోసం దాచిన 8 తులాల బంగారు, 30 తులాల వెండి, రూ.20 వేలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు పద్మ పోలీసుల ఎదుట వాపోయింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఫ్రిడ్జ్​లో పాలను వేడి చేసుకుని తాగి.. మరీ ఇంట్లోని సొమ్మును ఎత్తుకెళ్లారని బాధితురాలి బంధువు మహేశ్​ తెలిపారు.

పోలీసులకు సమాచారం ఇవ్వండి

సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడదని సూచించారు. కొవిడ్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో పండగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details