వస్త్రాలకు వన్నెలద్దిన పరిశ్రమలవి. రంగులతో కళకళలాడిన కార్ఖానాలవి. ఇప్పుడు రంగు వెలిసి పోయి.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ ఒక్క యంత్రమూ ఆడటం లేదు. ఈ పనినే నమ్ముకున్న కార్మికులు..ఇప్పుడు ఉపాధి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా సిరిసిల్ల అద్దకం పరిశ్రమ (sircilla dyeing industry)గురించే అంటే నమ్ముతారా..? వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి అద్దకం పరిశ్రమలు మూతబడ్డాయి. కొన్నిరోజులుగా రంగుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రాబడి మాత్రం ఎటూ చాలటం లేదు. ప్రభుత్వ సహకారమూ లేదు. చేసేదేమీ లేక పరిశ్రమను మూసి వేయటమే మేలు అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు యజమానులు.
15 వేలమంది కార్మికులపై ప్రభావం
ఈ పరిశ్రమ మూసివేతతో.. 2వేల మంది ఉపాధి కోల్పోయారు. 15 వేల మరమగ్గాల కార్మికులపై(weavers problems) ప్రభావం పడనుంది. నిజానికి నాణ్యమైన వస్త్రాలు తయారు చేయటంలో రాష్ట్రంలోని సిరిసిల్లపెట్టింది పేరు. దేశ నలుమూలలకూ ఇవి సరఫరా అవుతుంటాయి. వేలాది మందికి ఉపాధినిస్తోంది ఈ పరిశ్రమ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, కొత్తపల్లి, కమలాపూర్,గర్శకుర్తితో పాటు..సిరిసిల్ల కేంద్రంగా వస్త్రోత్పత్తి రంగంలో దాదాపు 50 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో అద్దకం పరిశ్రమ కార్మికులను నిత్యం కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేక చాలీచాలని కూలీతో ఇబ్బందులు పడుతున్నారు.
మూతపడుతున్న పరిశ్రమలు
సిరిసిల్ల చుట్టు పక్కల గ్రామాల కార్మికులతోపాటు పొరుగున ఉండే మెదక్, నిజామాబాద్, జిల్లాల్లోని వ్యవసాయ కూలీలూ ఈ అద్దకం పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి దొరకని వారంతా సిరిసిల్ల, కరీంనగర్ అద్దకం పరిశ్రమలోనే పని చేసుకుంటు న్నారు. కాస్తో కూస్తో వెనకేసుకుందాం అనుకుంటే అసలు రోజు గడవటమే కష్టమైపోయే దుస్థితికి వచ్చారు వీరంతా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 300 వరకు అద్దకం పరిశ్రమలు ఉండేవి. కాలానుగుణంగా అవి 60కి పడిపోయాయి. మూడు నెలల నుంచి రంగుల ధరలు పెరిగిపోయి పూర్తిగా నష్టం వాటిల్లుతుండడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా(dyeing industry problems in sircilla) నుంచి మూసివేశారు. ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే సుమారు 15 వేల మంది మరమగ్గాల, పెట్టికోట్స్ కుట్టే, సైజింగ్ కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది.
దెబ్బతిన్న యూనిట్లు
సిరిసిల్లలో(sircilla dyeing industry problems) 40 వేల మరమగ్గాలు ఉండగా ఇందులో నాలుగు సంవత్సరాల క్రితం వరకు 15 వేలకు పైగా మరమగ్గాలపైన కాటన్ ఉత్పత్తి జరిగేది. ఆ సమయంలో 300కు పైగా డైయింగ్ యూనిట్లలో అద్దకం పని సాగేది. తరచూ కాటన్ నూలు ధరల హెచ్చు తగ్గులతో పాటు పని కూడా కష్టతరంగా మారడం వల్ల పవర్లూం యజమానులు కాటన్ నుంచి పాలిస్టర్ బట్ట ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. ఫలితంగా ప్రస్తుతం 36 వేల వరకు మరమగ్గాలపై పాలిస్టర్ ఉత్పత్తి జరిగితే 4 వేల మర మగ్గాలపై కాటన్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రభావంతో డైయింగ్ యూనిట్లు కూడా దెబ్బ తిన్నాయి. ప్రస్తుతానికి 40 యూనిట్లలో మాత్రమే అద్దకం జరుగుతోంది. గతంలో రోజు 3 లక్షల మీటర్ల వరకు అద్దకం జరిగే బట్ట ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది.
ఇతర రాష్ట్రాల నుంచి పెరిగిన పోటీ
కాటన్ బట్టను వివిధ రంగుల్లో అద్ది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. గతంలో సిరిసిల్ల అద్దకం పరిశ్రమను కుటీర పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించి కొన్ని రాయితీలను కల్పించింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, గుజరాత్ రాష్ట్రంలోని అద్దకం పరిశ్రమలకు రాయితీలు(dyeing industry in other states)లేకపోవడం వల్ల అక్కడి పరిశ్రమలు కేస్మెట్ బట్ట తయారీపై అసక్తి చూపలేదు. సిరిసిల్ల పరిశ్రమపైనే ఆయా రాష్ట్రాలు అధారపడ్డాయి. కార్మికులకు ఉపాధి కూడా లభించింది. రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అద్దకం పరిశ్రమను అన్ని రాష్ట్రాల్లో కుటీర పరిశ్రమగానే గుర్తించింది. ఫలితంగా తమిళనాడులోని పలు ప్రాంతాలు సహా, రాజస్థాన్లోని బలహోత్రలో ఆధునిక డైయింగ్ యూనిట్లు ఏర్పడ్డాయి. ఈ కారణంగా సిరిసిల్ల అద్దకం పరిశ్రమకు పోటీ ఏర్పడింది.
పెరిగిన రంగుల ధరలు.. అదనపు భారం