తెలంగాణ

telangana

ఆసుపత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి : శ్రీధర్ బాబు

By

Published : May 23, 2021, 12:19 PM IST

మంథని మున్సిపల్ పరిధిలో మంజూరైన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలని కోరుతూ కలెక్టర్​కు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాశారు.

manthani mla sridhar babu wrote a letter to collector
ఆస్పత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి – శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో మంజూరు అయిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరుతూ… మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం మంథని నుంచి ఎగ్లాస్ పూర్ వెళ్లే రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూములైన సర్వే నంబర్ 315లో ఉన్న 2ఎకరాల 20 గుంటల భూమిని వాడుకోవాలని సూచించారు.

ఈ ప్రభుత్వ భూమికి ఎదురుగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఉందని.. ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తే బాగుంటుందని లేఖలో ఎమ్మెల్యే వివరించారు. ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

TAGGED:

ABOUT THE AUTHOR

...view details